UAE-India flights: చెన్నైకి ఎయిర్ అరేబియా కొత్త సర్వీస్
ABN , First Publish Date - 2022-04-12T15:16:05+05:30 IST
యూఏఈకి చెందిన లోకాస్ట్ క్యారియర్ ఎయిర్ అరేబియా తాజాగా భారత్కు మరో కొత్త సర్వీసును ప్రారంభించనుంది.
అబుదాబి: యూఏఈకి చెందిన లోకాస్ట్ క్యారియర్ ఎయిర్ అరేబియా తాజాగా భారత్కు మరో కొత్త సర్వీసును ప్రారంభించనుంది. అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి భారత్లోని తమిళనాడు రాజధాని చెన్నైకి ఈ కొత్త సర్వీస్ను నడపనుంది. ఈ నెల 27వ తేదీ నుంచి ఈ సర్వీస్ను ప్రారంభిస్తున్నట్లు ఎయిర్ అరేబియా ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఎయిర్ అరేబియా గ్రూపు సీఈఓ అదేల్ అల్ అలీ కీలక ప్రకటన చేశారు. చెన్నైకి కొత్త సర్వీసును ప్రారంభించడం ఆనందంగా ఉందని తన ప్రకటనలో పేర్కొన్నారు. కస్టమర్లు ఈ సర్వీసుకు సంబంధించిన విమాన టికెట్ల కోసం ఎయిర్ అరేబియా అధికారి వెబ్సైట్ లేదా కాల్ సెంటర్కు ఫోన్ చేసి బుక్ చేసుకోవచ్చని వెల్లడించారు.
కాగా, జూలై 2020లో అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి క్యారియర్ సర్వీస్ ప్రారంభించినప్పటి నుండి ఇది ఎయిర్ అరేబియాకు 19వ రూట్గా ఆయన తెలిపారు. ఇక ఇప్పటికే భారత్లోని ఐదు నగరాలకు అబుదాబి నుంచి ఎయిర్ అరేబియా డైరెక్ట్ విమాన సర్వీసులు నడపుతుండగా.. ఇది ఆరో సర్వీస్. ఇంతకుముందు కాలికట్, కొచ్చిన్, త్రివేండ్రం, ఢిల్లీ, జైపూర్ నగరాలకు డైరెక్ట్ విమాన సర్వీసులు ఉన్న విషయం తెలిసిందే.