లాక్‌డౌన్‌ ఎత్తేశాక అనేక మంది పోలీసులకు కరోనా వచ్చింది: డీజీపీ

ABN , First Publish Date - 2020-07-06T00:04:29+05:30 IST

లాక్‌డౌన్‌ ఎత్తేశాక అనేక మంది పోలీసులకు కరోనా వచ్చిందని డీజీపీ సవాంగ్‌ తెలిపారు. కోవిడ్‌ యోధులైన పోలీసులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

లాక్‌డౌన్‌ ఎత్తేశాక అనేక మంది పోలీసులకు కరోనా వచ్చింది: డీజీపీ

విశాఖ: లాక్‌డౌన్‌ ఎత్తేశాక అనేక మంది పోలీసులకు కరోనా వచ్చిందని డీజీపీ సవాంగ్‌ తెలిపారు. కోవిడ్‌ యోధులైన పోలీసులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా నియంత్రణలో పాల్గొన్న విశాఖ పోలీసులను డీజీపీ అభినందించారు. విశాఖ జిల్లాల్లో తొలి 3 నెలల్లో 98 కరోనా కేసులే వచ్చాయని, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఇప్పటి వరకు 466 మంది పోలీసులకు కరోనా సోకిందని, అన్ని దశల్లో పోలీసులు ముందుంటారు కాబట్టే వైరస్‌ బారిన పడుతున్నారని సవాంగ్ చెప్పారు.

Updated Date - 2020-07-06T00:04:29+05:30 IST