శామ్యూల్ ఆనంద్కు అదనపు బాధ్యతలు
ABN , First Publish Date - 2021-03-05T09:18:18+05:30 IST
శామ్యూల్ ఆనంద్కు అదనపు బాధ్యతలు
సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి శామ్యూల్ ఆనంద్కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. శామ్యూల్ ఇప్పటికే గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి గాను, ఎస్సీ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా, కమిషనరేట్ ఆఫ్ ఎంక్లయిరీస్ సభ్యుడిగా రిటైర్డ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అడిషనల్ డైరెక్టర్ కె.వెంకట్రామిరెడ్డిని నియమిస్తూ సాధారణ పరిపాలనశాఖ మరో ఉత్తర్వు జారీచేసింది.