చిక్కడపల్లి ఎస్ఐపై ఏసీపీ విచారణ?
ABN , First Publish Date - 2020-04-30T14:47:16+05:30 IST
చిక్కడపల్లి ఎస్ఐ కిశోర్పై వచ్చిన ఆరోపణలపై ఆబిడ్స్
హైదరాబాద్/చిక్కడపల్లి : చిక్కడపల్లి ఎస్ఐ కిశోర్పై వచ్చిన ఆరోపణలపై ఆబిడ్స్ ఏసీపీ భిక్షంరెడ్డి విచారణ జరిపినట్లు తెలిసింది. బుధవారం చిక్కడపల్లి సీఐ, ఎస్ఐతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. దీనిపై సీపీకి నివేదిక ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఏసీపీని సంప్రదించగా... సీపీ కార్యాలయంలో అడిగి తెలుసుకోవాలని సూచించారు.