వైసీపీ నేతలను చెప్పులతో తరమడం ఖాయం: అచ్చెన్న
ABN , First Publish Date - 2021-02-27T23:24:26+05:30 IST
పలాసలో వైసీపీ దురాగతాలు సాగనివ్వమని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
విజయనగరం: పలాసలో వైసీపీ దురాగతాలు సాగనివ్వమని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కౌన్సిలర్లను చేర్చుకున్నా.. ఓటమి తప్పదని గుర్తుంచుకోవాలన్నారు. అధికార బలంతో ఎన్నికల్లో గెలవడం అసాధ్యమన్నారు. పలాసలో వైసీపీ నేతలను రబ్బరు చెప్పులతో తరమడం ఖాయమన్నారు. టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థులను బెదిరించి వైసీపీలో చేర్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలాసలో మంత్రి అరాచకాలకు.. మున్సిపల్ ఎన్నికలు చెంపపెట్టు కానున్నాయని అచ్చెన్నాయుడు తెలిపారు.