ఉన్నత విద్యాశాఖ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
ABN , First Publish Date - 2021-03-04T01:38:15+05:30 IST
నగరంలోని సైఫాబాద్లో ఉన్న ఉన్నత విద్యాశాఖ కార్యాలయంలో
హైదరాబాద్: నగరంలోని సైఫాబాద్లో ఉన్న ఉన్నత విద్యాశాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.40 వేలు లంచం తీసుకుంటూ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఫైల్ క్లియరెన్స్ కోసం లక్ష లంచాన్నిఅసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ ఆశ్రయించాడు. అయితే రూ.40 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. కార్యాలయంలో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.