Big Debate: నాకు సీఎం కేసీఆర్ టార్గెట్ కాదు: వేమూరి రాధాకృష్ణ
ABN , First Publish Date - 2022-08-28T01:16:14+05:30 IST
ఢిల్లీలో ఏం జరిగిందో స్పష్టమైన సమాచారం ఉందని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ...
హైదరాబాద్ (Hyderabad): ఢిల్లీలో ఏం జరిగిందో స్పష్టమైన సమాచారం ఉందని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ (Abn Andhrajyothy Md Vemuri RadhaKrishna) అన్నారు. ఎమ్మెల్సీ కవితతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బిగ్ డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్లో లిక్కర్ స్కామ్ (Liquor Scam)లో ఆధారాలు లేని ఆరోపణలకు ఊతం ఇవ్వరాదని ..ప్రైవేటు సంభాషణలను వక్రీకరించి రాయవద్దన్న ఎమ్మెల్సీ కవిత (Mlc Kavitha) వ్యాఖ్యలకు రాధాకృష్ణ సమాధానం ఇచ్చారు. తనకు సీఎం కేసీఆర్ టార్గెట్ కాదని.. తెలంగాణ వేరని.. టీఆర్ఎస్ వేరని చెప్పారు. అలాగే కవిత ఇంటిపై ఆందోళనకారులు దాడి చేయడం కరెక్ట్ కాదన్నారు. ఓ ఆడబిడ్డ ఇంటి మీదకు వెళ్లడం సమర్థనీయం కాదని రాధాకృష్ణ స్పష్టం చేశారు. తెలంగాణకు సీఎం కేసీఆర్ నష్టం చేస్తారని తాను అననిని ఆర్కే తెలిపారు.