5 నిమిషాల్లో కరోనా పరీక్ష
ABN , First Publish Date - 2020-03-29T09:33:03+05:30 IST
కరోనా ఉందో.. లేదో 5 నిమిషాల్లో తేల్చేసే చిన్నపాటి పరీక్షా పరికరాన్ని అమెరికాలోని అబాట్ లేబొరేటరీస్ అభివృద్ధిచేసింది. రొట్టెలు కాల్చే చిన్నపాటి టోస్టర్
- అభివృద్ధిచేసిన అమెరికా కంపెనీ ‘అబాట్’
న్యూఢిల్లీ, మార్చి 28 : కరోనా ఉందో.. లేదో 5 నిమిషాల్లో తేల్చేసే చిన్నపాటి పరీక్షా పరికరాన్ని అమెరికాలోని అబాట్ లేబొరేటరీస్ అభివృద్ధిచేసింది. రొట్టెలు కాల్చే చిన్నపాటి టోస్టర్ సైజులో ఉండే ఈ పరికరం మాలిక్యులర్ టెక్నాలజీ ఆధారంగా శాంపిళ్లను విశ్లేషించి ఫలితాలను అందిస్తుంది. ఒకవేళ రోగికి నెగెటివ్ ఉంటే(కరోనా లేకుంటే) ఫలితం ఇవ్వడానికి ఇంచుమించు 13 నిమిషాల దాకా తీసుకుంటుంది. దీన్ని ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లి అనుమానిత లక్షణాలున్న వారికి కరోనా పరీక్షలు చేయొచ్చు. దీనికి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎ్ఫడీఏ) నుంచి అత్యవసర అనుమతి లభించడంతో, వచ్చే వారంకల్లా మార్కెట్లో అందుబాటులోకి తెచ్చేందుకు ‘అబాట్’ కసరత్తు ప్రారంభించింది.