అథ్లెట్లకు సన్మానం
ABN , First Publish Date - 2022-08-19T10:06:06+05:30 IST
జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న తెలుగు అథ్లెట్లను జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్..
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న తెలుగు అథ్లెట్లను జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, మైత్రాహ్ సంస్థల చైర్మన్ రవి కైలాస్ ఘనంగా సత్కరించారు. గురువారం హైదరాబాద్లోని టూరిజం ప్లాజాలో జరిగిన ఈ కార్యక్రమంలో భారత స్టార్ స్ర్పింటర్ ద్యూతీ చంద్తో పాటు తెలుగు అథ్లెట్లు యర్రాజి జ్యోతి, అగసర నందిని, కె.రజిత, డి.జ్యోతిక శ్రీ, ఎన్.శ్రీనివా్స, కె.ప్రణయ్, ఎం.అనూష, దిల్ఖుష్ యాదవ్ను సన్మానించారు. వీరందరికి గోపీచంద్-మైత్రాహ్ సంస్థ ప్రత్యేక శిక్షణతో పాటు వివిధ రకాలుగా తోడ్పాటు అందిస్తోంది. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేష్, స్పోర్ట్స్ ప్రమోటర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.