అమెరికాలో రోడ్డు ప్రమాదం
ABN , First Publish Date - 2020-11-30T10:27:40+05:30 IST
నారాయణపేట జిల్లాలోని మరికల్ మండలం పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన పటేల్ నర్సింహారెడ్డి (57), ఆయన భార్య లక్ష్మి (50), కుమారుడు భరత్కుమార్ రెడ్డి (24)
అమెరికాలో తెలుగు వారి మృతి
భార్యా, భర్త, కుమారుడు అక్కడికక్కడే మృతి
తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కుమార్తె
స్వస్థలం నారాయణపేట జిల్లా పెద్ద చింతకుంటలో విషాదం
మరికల్, నవంబరు 29 : నారాయణపేట జిల్లాలోని మరికల్ మండలం పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన పటేల్ నర్సింహారెడ్డి (57), ఆయన భార్య లక్ష్మి (50), కుమారుడు భరత్కుమార్ రెడ్డి (24) అమెరికాలోని రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. టెక్స స్ రాష్ట్రంలోని టెక్సస్ నగరంలో శనివారం ఈ దుర్ఘటన జరిగింది. కుమార్తె మౌనిక తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికల్ మండలంలో పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి.. హైదరాబాద్ ఆర్టీసీ డిపోలో కండక్టర్గా పనిచేస్తున్నారు. ఆయన పిల్లలిద్దరూ ఉద్యోగరీత్యా అమెరికాలో ఉంటున్నారు. వారిని చూసేందుకు మూడు నెలల క్రితం నర్సింహారెడ్డి, లక్ష్మి అమెరికాకు వెళ్లారు.
అక్కడ కుమార్తె మౌనిక వివాహ సంబంధం కోసం కారులో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. తల్లిదండ్రులతో పాటు కుమారుడు భరత్ అక్కడికక్కడే మృతి చెందారు. మౌనిక, మరొకరు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం పెద్ద చింతకుంట గ్రామంలో తెలియడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను సొంత గ్రామానికి తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు, బంధువులు విజ్ఞప్తి చేస్తున్నారు.