నారాయణకు ర్యాంకుల పంట

ABN , First Publish Date - 2022-08-09T09:01:47+05:30 IST

జేఈఈ మెయిన్‌లో తమ విద్యార్థులు అఖిలభారత ర్యాంకులతో సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ తెలిపారు.

నారాయణకు ర్యాంకుల పంట

హైదరాబాద్‌, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): జేఈఈ మెయిన్‌లో తమ విద్యార్థులు అఖిలభారత ర్యాంకులతో సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ తెలిపారు. అన్ని క్యాటగిరీల్లో కలిపి 12 మంది విద్యార్థులు 10లోపు ర్యాంకులు సాధించారని, 100లోపు 97 ర్యాంకులు సాధించారని వెల్లడించారు. ఆలిండియా ఓపెన్‌ క్యాటగిరిలో ధీరజ్‌ 7, అనికేత్‌ 8, సాత్విక్‌ 10వ ర్యాంకు సాధించారని తెలిపారు. అన్ని కేటగిరిల్లో 571 మంది విద్యార్థులు వెయ్యి లోపు ర్యాంకులు సాధించారన్నారు. విద్యార్థులతో పాటు అధ్యాపక సిబ్బందిని వారు సోమవారం అభినందించారు.

Updated Date - 2022-08-09T09:01:47+05:30 IST