TS News: చేనులో నాగలిపై పడి రైతు మృతి....

ABN , First Publish Date - 2022-09-23T14:49:37+05:30 IST

జిల్లాలోని రేగొండ మండలం దుంపిల్లపల్లిలో విషాదం చోటు చేసుకుంది.

TS News: చేనులో నాగలిపై పడి రైతు మృతి....

జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలోని రేగొండ మండలం దుంపిల్లపల్లిలో విషాదం చోటు చేసుకుంది. పంట చేనులో నాగలితో అచ్చుకొడుతుండగా నాగలికి విద్యుత్ వైర్లు తగిలి రైతు బత్తిని కొమురయ్య(45) అక్కడికక్కడే మృతి  చెందాడు. చేనులో నాగలిపైనే పడి రైతు కన్నుమూశాడు. రైతు మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 


Updated Date - 2022-09-23T14:49:37+05:30 IST