మిర్యాలగూడలో విస్తరిస్తున్న కరోనా వైరస్

ABN , First Publish Date - 2020-04-02T17:54:22+05:30 IST

మిర్యాలగూడలో కరోనా వైరస్ విస్తరిస్తోంది.

మిర్యాలగూడలో విస్తరిస్తున్న కరోనా వైరస్

నల్గొండ జిల్లా: మిర్యాలగూడలో కరోనా వైరస్ విస్తరిస్తోంది. నగరంలో రెండో పాజిటీవ్ కేసు నమోదైంది. సీతారాంపురంకు చెందిన ఓ మహిళకు కరోనా పాజిటీవ్ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఈ బాధితురాలు కూడా ఢిల్లీలో జరిగిన మతపరమైన సమావేశాలకు హాజరై తిరిగి వచ్చింది. దీంతో ఆమెను అధికారులు హైదరాబాద్‌లో నల్లకుంట ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. ఆమె కుటుంబసభ్యులతో పాటు సన్నిహితంగా మెలిగినవారిని కూడా ఐసోలేషన్‌కు తరలించేందుకు వివరాలు సేకరిస్తున్నారు. మిర్యాలగూడలో రెండు కరోనా కేసులు వెలుగులోకి రావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.

Updated Date - 2020-04-02T17:54:22+05:30 IST