తల్లీకొడుకు ఆత్మహత్య కేసులో మున్సిపల్ చైర్మన్, సీఐసహా ఐదుగురిపై కేసు నమోదు
ABN , First Publish Date - 2022-04-16T21:54:48+05:30 IST
తల్లీకొడుకు ఆత్మహత్య కేసులో మున్సిపల్ చైర్మన్, సీఐసహా ఐదుగురిపై కేసు నమోదు
కామారెడ్డి: తల్లీకొడుకు ఆత్మహత్య కేసులో ఏడుగురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సంతోష్ సెల్ఫీ వీడియో ఆధారంగా కేసు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు. 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. మున్సిపల్ చైర్మన్ జితేందర్, సీఐ నాగార్జున గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ యాదగిరి సహా నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. రామాయంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్ ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పద్మ, సంతోష్ మృతదేహాలతో బంధువులు ఆందోళనకు దిగారు.