హాస్టల్‌లో ఘోరం: పసివాడు ఒంటరిగా ఉన్నాడని తెలిసిన వార్డెన్ దారుణంగా..

ABN , First Publish Date - 2020-06-07T17:24:05+05:30 IST

లాక్ డౌన్ కారణంగా స్కూల్ హాస్టల్‌లో చిక్కుకుపోయిన 3వ తరగతి పసి బాలుడిపై ఓ మృగం కన్నుపడింది.

హాస్టల్‌లో ఘోరం: పసివాడు ఒంటరిగా ఉన్నాడని తెలిసిన వార్డెన్ దారుణంగా..

లక్నో: లాక్ డౌన్ కారణంగా స్కూల్ హాస్టల్‌లో చిక్కుకుపోయిన 3వ తరగతి పసి బాలుడిపై ఓ మృగం కన్నుపడింది. స్కూల్లో మిగిలిపోయింది అతడొక్కడే కావడం హాస్టల్ వార్డెన్ బరి తెగించాడు. బాలుడితో తన శుభ్రం చేయించడమే కాకుండా అతడిపై లైంగికా వేధింపులకు కూడా పాల్పడ్డాడు. పసివాడు అని కూడా చూడకుండా దారుణాలకు ఒడిగట్టాడు. డెహ్రాడూన్‌లోని ఓ ప్రేవేటు పాఠశాలలో మే నెలలో ఈ ఘోరం జరిగింది. లాక్ డౌన్ ఆంక్షలు సడలింపుతో విద్యార్థి తల్లిదండ్రులు తమ కుమారుడిని ఇంటికి తీసుకెళ్లేందుకు ఉత్తరప్రదేశ్ నుంచి ఇటీవల డెహ్రాడూన్‌కు వచ్చారు. కానీ విద్యార్థిని అప్పగించేందుకు తొలుత స్కూలు సిబ్బంది తటపటాయించారు. తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో మరో గత్యంతరం లేక వారు బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో జరిగిన దారుణం వెలుగు లోకి వచ్చింది. హాస్టల్‌లో పసివాడు ఒంటరిగా ఉన్న సమయంలో హరీశ్ అనే వార్డెన్ ఈ దుర్చర్యకు పాల్పడ్డాడని తెలిసి ఆవేదన చెందిన తల్లిదండ్రులు శనివారం నాడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పాక్సో చట్టంతో పాటూ పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి..అతడిని అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2020-06-07T17:24:05+05:30 IST