అర్బన్ జిల్లాలో 74 కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-08-15T10:37:35+05:30 IST
వరంగల్ అర్బన్లో శుక్రవారం 74 కరోనా కేసులు నమోదు అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ లలితాదేవి, ఎంజీఎం ఇంచార్జి
హన్మకొండ అర్బన్, ఆగస్టు 14 : వరంగల్ అర్బన్లో శుక్రవారం 74 కరోనా కేసులు నమోదు అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ లలితాదేవి, ఎంజీఎం ఇంచార్జి సూపరింటెండెంట్ నాగార్జునరెడ్డి తెలిపారు. గురు, శుక్రవారం నిర్వహించిన పరీక్షల్లో ధీర్ఘకాలిక వ్యాధులు కలిగిన బాధితులను గుర్తించి ఇందులో ప్రాథమిక స్థాయి దాటిన వారిని ఎంజీఎం కొవిడ్ వార్డులో చేర్చి వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. కాగా, కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళనకు గురువుతున్నారు.