సంగారెడ్డిలో కొత్తగా 7 కరోనా కేసులు నమోదు
ABN , First Publish Date - 2020-07-12T00:53:12+05:30 IST
తెలంగాణలో రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి.
సంగారెడ్డి : తెలంగాణలో రోజురోజుకూ కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కేసులు పెరిగిపోతుండటంతో ఇక్కడ నివాసముంటున్న జనాలు సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. ఈ తరుణంలో ఆంధ్రాలో మాదిరిగా సొంతూరికి రాగానే టెస్ట్లు, క్వారంటైన్ లాంటివి లేకపోవడంతో పల్లెల్లో సైతం కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా.. సంగారెడ్డి జిల్లాలో ఇవాళ కొత్తగా 7 కరోనా పాజిటివ్ కేసుల నమోదయ్యాయి. వీరంతా బయటి నుంచి వ్యక్తులు, వారితో కాంటాక్ట్ అయిన వారని సమాచారం. ప్రస్తుతం వీరందర్నీ కోవిడ్ ఆస్పత్రికి తరలించిన అధికారులు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు వీరితో ఇంకా ఎవరెవరు కాంటాక్ట్ అయ్యారు..? వీళ్లు ఎక్కడెక్కడ తిరిగారు..? అని తెలుసుకునే పనిలో జిల్లా వైద్యాధికారులు, పోలీసులు నిమగ్నమయ్యారు.