క్యూ3లో 5 కోట్ల విక్రయాలు
ABN , First Publish Date - 2020-10-23T06:25:09+05:30 IST
ఈ ఏడాది సెప్టెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో దేశవ్యాప్తంగా 5 కోట్ల స్మార్ట్ఫోన్లు అమ్ముడయ్యాయని మార్కెట్ రీసెర్చ్ సంస్థ కనాలిస్ వెల్లడించింది...
- దేశంలో స్మార్ట్ఫోన్ మార్కెట్పైౖ కనాలిస్ రిపోర్టు
న్యూఢిల్లీ: ఈ ఏడాది సెప్టెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో దేశవ్యాప్తంగా 5 కోట్ల స్మార్ట్ఫోన్లు అమ్ముడయ్యాయని మార్కెట్ రీసెర్చ్ సంస్థ కనాలిస్ వెల్లడించింది. త్రైమాసిక విక్రయాల్లో ఇదే ఆల్టైం రికార్డు అని అంటోంది. గత ఏడాదిలో ఇదే సమయానికి 4.62 కోట్ల మొబైళ్లు అమ్ముడయ్యా యి. లాక్డౌన్ అనంతరం దేశీయ స్మార్ట్ఫోన్ మార్కె ట్ వేగంగా పుంజుకుందని కనాలిస్ రిపోర్టులో పేర్కొం ది. క్యూ3 విక్రయాల్లో 76 శాతం వాటా చైనా కంపెనీలదేనని తెలిపింది. ప్రీమియం స్మార్ట్ఫోన్ల విభాగం విషయానికొస్తే, యాపిల్ 8 లక్షల యూనిట్ల అమ్మకాలతో రెండంకెల వృద్ధిని నమోదు చేసుకుంది.