నిజామాబాద్ జిల్లాలో 47కు చేరిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-04-09T19:42:27+05:30 IST

నగరంలో తాజాగా గురువారం మరో 8 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి.

నిజామాబాద్ జిల్లాలో 47కు చేరిన కరోనా కేసులు

నిజామాబాద్ జిల్లా: నగరంలో తాజాగా గురువారం మరో 8 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసులు 47కు చేరాయి. ఇక్కడ ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారు ఎక్కువకావడంతో కేసులు సంఖ్య పెరిగిందని అధికారులు భావిస్తున్నారు. 47లో ఢిల్లీ నుంచి వచ్చినవారిలో 25 కేసులు నమోదయ్యాయి. ఐదు రోజులుగా జిల్లాలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. 172 మందికి చెందిన శాంపిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. నిజామాబాద్ నగరంలో 15 కరోనా ప్రభావిత ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు. ఆ కాలనీలను పూర్తిగా నిర్బంధించారు. గట్టి ఆంక్షలు అమలు చేస్తున్నారు.


Updated Date - 2020-04-09T19:42:27+05:30 IST