నేపాల్లో ఘోరం.. నలుగురు భారతీయులు మృతి
ABN , First Publish Date - 2022-04-25T16:46:33+05:30 IST
నేపాల్లో ఆదివారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. ఐదుగురు ప్రయాణిస్తున్న కారును బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ సహా నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే. ఉత్తరప్రదేశ్కు చెందిన బిమల్చంద్ర అగర్వాల్(40) , సాధన అగర్వాల్(3
ఎన్నారై డెస్క్: నేపాల్లో ఆదివారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. ఐదుగురు ప్రయాణిస్తున్న కారును బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ సహా నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే. ఉత్తరప్రదేశ్కు చెందిన బిమల్చంద్ర అగర్వాల్(40) , సాధన అగర్వాల్(35), సంధ్య అగర్వాల్(40), రాకేశ్ అగర్వాల్ కొద్ది రోజుల క్రితం నేపాల్ టూర్ వెళ్లారు. ఈ క్రమంలో ఆదివారం నేపాల్లోని పొఖారాను సందర్శించారు. అనంతరం ఖాట్మాండుకు తిరిగి పయనం అయ్యారు. వారు ప్రయాణిస్తున్న కారును థాక్రేకు చేరుకోగానే బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు భారతీయులు సహా నేపాల్కు చెందిన కారు డ్రైవర్ దిల్ బహదూర్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండతా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.