ప్రకాశం జిల్లాలో 38కి పెరిగిన పాజిటివ్ కేసులు

ABN , First Publish Date - 2020-04-10T18:20:56+05:30 IST

ప్రకాశం : జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 38కి చేరింది. రిమ్స్, కిమ్స్ ఐసోలేషన్‌లో 36 మంది చికిత్స పొందుతున్నారు.

ప్రకాశం జిల్లాలో 38కి పెరిగిన పాజిటివ్ కేసులు

ప్రకాశం : జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 38కి చేరింది. రిమ్స్, కిమ్స్ ఐసోలేషన్‌లో 36 మంది చికిత్స పొందుతున్నారు. నెల్లూరులో ఒకరు చికిత్స తీసుకుంటున్నారు. కాగా.. లండన్ నుంచి వచ్చిన కరోనా బారీన పడ్డ యువకుడు కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడు. నిజాముద్దీన్ నుంచి జిల్లాకి వచ్చిన 16 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. నిజాముద్దీన్ నుంచి వచ్చిన వారి ద్వారా 20 మందికి వైరస్ సోకింది. 


జిల్లాలో కరోనా ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య 38కి చేరుకుంది. ఒంగోలు- 23, చీరాల- 5, కారంచేడు మండలం కుంకలమర్రు- 4,  కందుకూరు- 3, కనిగిరి -01, చీమకుర్తి-01, కొనకనమిట్ల మండలం యు.వెలిగండ్ల-01 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2020-04-10T18:20:56+05:30 IST