మహిళల టీ20 చాలెంజ్‌లో 3 జట్లే!

ABN , First Publish Date - 2021-04-13T09:18:16+05:30 IST

మహిళల టీ20 చాలెంజ్‌ టోర్నీని మూడు జట్లకే పరిమితం చేయాలని బీసీసీఐ యోచిస్తోంది. ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ సందర్భంగా ఈ టోర్నీ జరగనున్న సంగతి తెలిసిందే...

మహిళల టీ20 చాలెంజ్‌లో 3 జట్లే!

న్యూఢిల్లీ: మహిళల టీ20 చాలెంజ్‌ టోర్నీని మూడు జట్లకే పరిమితం చేయాలని బీసీసీఐ యోచిస్తోంది. ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ సందర్భంగా ఈ టోర్నీ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే టీ20 చాలెంజ్‌ను నాలుగు జట్లతో నిర్వహించాలని బోర్డు గత ఏడాది ఆలోచించినా కరోనా దరిమిలా మూడు జట్లతోనే టోర్నీని జరపాలని భావిస్తోంది. 


Updated Date - 2021-04-13T09:18:16+05:30 IST