మొదటి వేవ్ కంటే రెండో వేవ్ ప్రభావం తక్కువే: హెచ్డీఎఫ్సీ చైర్మన్
ABN , First Publish Date - 2021-06-25T05:25:09+05:30 IST
ఆర్థికవ్యవస్థపై కరోనా సెకెండ్ వేవ్ చూపించిన ప్రభావం మొదటి వేవ్ కంటే తక్కువేనని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చైర్మన్ దీపక్ పరేఖ్ తాజాగా తెలిపారు.
ముంబై: ఆర్థికవ్యవస్థపై కరోనా సెకెండ్ వేవ్ చూపించిన ప్రభావం మొదటి వేవ్ కంటే తక్కువేనని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చైర్మన్ దీపక్ పరేఖ్ తాజాగా తెలిపారు. గతేడాది ఒక్కసారిగా ప్రకటించిన జాతీయ లాక్ డౌన్తో ఆర్థిక వ్యవస్థ భారీ కుదుపునకు లోనైందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే..ద్వితీయార్థంలో తమ అంచనాల కంటే ఎక్కువగానే దేశంలో వస్తువినియోగం, డిమాండ్ పెరిగాయని దీపక్ పేర్కొన్నారు. ఈ కష్టసమయంలో దేశానికి మార్గనిర్దేశం చేసిన ఆర్బీఐ, సెబీలకు అభినందించాలని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంతర్జాతీయంగానూ ఆర్థికాభివృద్ధి మందకొడిగా ఉండబోతోందని ఆయన తెలిపారు.