రూ.2 కోట్ల ఎర్రచందనం స్వాధీనం
ABN , First Publish Date - 2022-03-06T15:59:53+05:30 IST
స్థానిక ఆవడి సమీపంలోని కాట్టూరు సిప్కాట్ గోదాములో దాచిన రూ.2 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అటవీశాఖ ఇంటెలిజెన్స్ విభాగానికి అందిన
పెరంబూర్(చెన్నై): స్థానిక ఆవడి సమీపంలోని కాట్టూరు సిప్కాట్ గోదాములో దాచిన రూ.2 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అటవీశాఖ ఇంటెలిజెన్స్ విభాగానికి అందిన రహస్య సమాచారంతో అధికారులు ఆ గోదాములో శనివారం ఉదయం ఆకస్మికదాడులు చేపట్టారు. అక్కడ ప్లాస్టిక్ పట్టల కింద దాచిన 2 టన్నులను గుర్తించి స్వాధీనం చేసుకున్న అధికారులు, వాటిని గుమ్మిడిపూండిలోని అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ గోదాము యజమాని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.