అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై అధికారులు బులెటిన్ విడుదల చేశారు. ఏపీలో కొత్తగా 184 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు. ఇప్పటివరకు ఏపీలో మొత్తం 20,73,093 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇప్పటి వరకు 14,443 మరణాలు సంభవించాయి. ఏపీలో 2,149 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 20,56,501 మంది రికవరీ చెందారు.