తెలంగాణలో కొత్తగా 18 పాజిటీవ్ కేసులు
ABN , First Publish Date - 2020-04-10T16:44:07+05:30 IST
తెలంగాణలో కొత్తగా 18 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.
హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 18 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రోగుల సంఖ్య 471కి చేరింది. బాధితుల్లో 388 మంది మర్కజ్కు వెళ్లివచ్చినవారు ఉన్నారని, వారితో కలిసినవారు కూడా ఉన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటీవ్గా తేలి చికిత్స పొందుతున్నవారంతా ఈనెల 24వ తేదీకల్లా కోలుకుంటారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. మర్కజ్ కేసులు లేకుంటే.. ఇప్పటికే తెలంగాణ కరోనా రహితం అయ్యేదని అన్నారు. శుక్రవారం నుంచి కేసులు తగ్గుముఖం పడతాయని 4,5 రోజుల తర్వాత అసలు ఉండవని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా తెలంగాణలో కరోనాతో ఇంత వరకు 12 మంది చనిపోయారు. 45 మంది డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్లోని గాంధీ, కింగ్ కోటి ఆస్పత్రిలో 414 మంది చికిత్స పొందుతున్నారు. మర్కజ్ లింకు ఉన్నవాళ్లలో శుక్రవారం 60 నుంచి 70 మంది డిశ్చార్జ్ కానున్నారు. శనివారం ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్ తర్వాత లాక్ డౌన్పై సీఎం కేసీఆర్ స్పష్టత ఇస్తారని మంత్రి తెలిపారు.