14 ఏళ్ల బాలికపై వార్డెన్ అత్యాచారం.. రహస్యంగా అబార్షన్ చేయించిన తల్లి!

ABN , First Publish Date - 2020-06-07T03:14:06+05:30 IST

ఓ 14 ఏళ్ల బాలికను ఆమె ఉంటున్న హాస్టల్ వార్డెన్ బలాత్కరించాడు.

14 ఏళ్ల బాలికపై వార్డెన్ అత్యాచారం.. రహస్యంగా అబార్షన్ చేయించిన తల్లి!

ముంబై: ఓ 14 ఏళ్ల బాలికను ఆమె ఉంటున్న హాస్టల్ వార్డెన్ బలాత్కరించాడు. ఇలా ఒక్కసారి కాదు మార్చి నెల నుంచి పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో దివ్యాంగురాలైన ఆమె గర్భం దాల్చింది. ఈ విషయం తెలిసిన ఆమె తల్లి, ఓ నర్సు సాయంతో ఇంట్లోనే రహస్యంగా బాలికకు అబార్షన్ చేయించింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కాటోల్‌లోని హాస్టల్ వార్డెన్ రాజేంద్ర కాల్బందే(44)ను అదుపులోకి తీసుకున్నారు. అలాగే సింధు దేహాంకర్ అనే నర్సును, బాలిక తల్లిని కూడా అరెస్టు చేసినట్లు అధికారులు తెలియజేశారు. సదు బాలిక ఆ హాస్టల్‌లో దాదాపు 5ఏళ్లుగా ఉంటోందని తెలుస్తోంది.

Updated Date - 2020-06-07T03:14:06+05:30 IST