ఏపీలో కొత్తగా 1,413 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-08-09T23:35:31+05:30 IST

రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్

ఏపీలో కొత్తగా 1,413 కరోనా కేసులు

అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఏపీలో కొత్తగా 1,413 కరోనా కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. కరోనాతో కొత్తగా 18 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ 19,83,721 కేసులున్నాయి. కరోనాతో ఇప్పటివరకు 13,549 మంది మరణించారు. రాష్ట్రంలో మొత్తం 19,549 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 19,50,623 మంది రికవరీ చెందారు. కరోనాతో చిత్తూరు జిల్లాలో ఐదుగురు, కృష్ణాలో ముగ్గురు మృతి చెందారు. తూర్పు గోదావరి, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు. 

Updated Date - 2021-08-09T23:35:31+05:30 IST