15నాటికి 14 వేల మరుగుదొడ్లు
ABN , First Publish Date - 2020-08-13T07:46:51+05:30 IST
ఈ నెల 15 నాటికి రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో మరో 14 వే ల మరుగుదొడ్లు
హైదరాబాద్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 15 నాటికి రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో మరో 14 వే ల మరుగుదొడ్లు(సీట్లు) అందుబాటులోకి రానున్నాయి. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు పట్టణాల్లో ప్రతి 1000 మంది జనాభాకు ఒక మరుగుదొడ్డిని(పబ్లిక్ టాయిటెల్) నిర్మించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో 7200, ఇతర మునిసిపాలిటీల్లో 7683 మరుగుదొడ్లు వినియోగంలోకి రానున్నాయని మునిసిపల్ అధికారులు తెలిపారు.