ఏపీలో కరోనాతో 10 మంది మృతి
ABN , First Publish Date - 2022-02-04T02:18:26+05:30 IST
రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్
అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఏపీలో కొత్తగా 4,605 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో 10 మరణాలు సంభవించాయి. ఏపీలో మొత్తం 22,93,171 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇప్పటివరకు మొత్తం 14,641 మంది మరణించారు. ఏపీలో 93,488 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 21,85,042 మంది రికవరీ చెందారు.