మొబైల్స్ విక్రయానికి ముందే ఐఎంఈఐ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
ABN , First Publish Date - 2022-09-28T06:30:01+05:30 IST
భారత్లో విక్రయించే అన్ని మొబైల్ ఫోన్స్ ఐఎంఈఐ (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్వి్పమెంట్ ఐడెంటిటీ) నంబర్ని ముందుగానే యాంటీ కౌంటర్ఫీట్ అండ్ లాస్ట్ హ్యాండ్సెట్ బ్లాకింగ్ పోర్టల్లో రిజిస్టర్ చేయడం తప్పనిసరని ప్రభుత్వం స్పష్టం చేసింది.
2023 జనవరి 1 నుంచి అమలు
న్యూఢిల్లీ:భారత్లో విక్రయించే అన్ని మొబైల్ ఫోన్స్ ఐఎంఈఐ (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్వి్పమెంట్ ఐడెంటిటీ) నంబర్ని ముందుగానే యాంటీ కౌంటర్ఫీట్ అండ్ లాస్ట్ హ్యాండ్సెట్ బ్లాకింగ్ పోర్టల్లో రిజిస్టర్ చేయడం తప్పనిసరని ప్రభుత్వం స్పష్టం చేసింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ నిబంధన అమలులోకి రానుంది. ప్రతి మొబైల్ 15 అంకెల వినూత్న ఐఎంఈఐ నంబరును కలిగి ఉంటుంది. అయినప్పటికీ, పోగొట్టుకున్న ఫోన్లను ఈ నంబరు ఆధారంగా వెతకడం కొన్నిసార్లు సాధ్యపడటం లేదు. ఎందుకంటే, అదే ఐఎంఈఐ నంబరుతో టెలికాం నెట్వర్క్లో మరో (నకిలీ) ఫోన్ వినియోగంలో ఉండటం ఇందుకు కారణమవుతోంది. అందుకే, ప్రభుత్వం మొబైల్ కంపెనీలకు ఫోన్లను విక్రయించే ముందు వాటి ఐఎంఈఐని రిజిస్టర్ చేయడం తప్పనిసరి చేసింది.