తెలంగాణలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఏటూరు నాగారం మండలం ఏజెన్సీ అడవుల్లో ఇవాళ(ఆదివారం) ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోలు మృతిచెందారు. చల్పాక అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి.
ఎదురు కాల్పుల్లో మృతిచెందిన ఏడుగులు మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు ట్రాక్టర్లలో ఏటూరు నాగారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారి మృతదేహాలకు మరికాసేపట్లో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. మృతిచెందిన మావోయిస్టుల వివరాలను పోలీసులు వెల్లడించారు.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకే బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు. ప్రభుత్వ హాస్టళ్లలో ఫుజ్ పాయిజనింగ్ ఘటనల్లో వారి కుట్ర ఉందని సీతక్క ఆరోపించారు.
మహబూబాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం గిరిజన రైతు మహా ధర్నా జరగనుంది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాకను నిరసిస్తూ లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బాబు నాయక్ తండా గిరిజనులు నిరసన చేపట్టారు. వైద్య కళాశాల కోసం తమ భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుందని.. కేటీఆర్కు మహబూబాబాద్కు వచ్చే అర్హత లేదని.. కేటీఆర్ గో బ్యాక్... గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో గిరిజన, దళితులు, రైతులపై జరుగుతున్న దాడులకు నిరసనగా బీఆర్ఎస్ మహబూబాబాద్లో దర్నాకు పిలుపిచ్చింది. అయితే ఈ ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది. షరతులతో కూడిన దర్నాకు అనుమతినిచ్చింది. దీంతో సోమవారం మహబూబాబాద్లో బీఆర్ఎస్ ధర్నా నిర్వహిస్తుంది.
దేశంలో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందులోభాగంగా 2026, మార్చిలో నెలలోపు దేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ద్వయం లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
సినిమాలు, వెబ్ సిరీస్ ప్రభావమో ఏమో కానీ దొంగలు కొత్త పంథాను అనుసరిస్తున్నారు. కరెంట్ ఆఫ్ చేసి, గ్యాస్ కట్టర్ల కిటికీల గ్రిల్స్ తొలగించి దొంగతనం చేస్తున్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి ఎస్బీఐ బ్యాంక్లో భారీ దోపిడీ జరిగింది. ఉదయం వచ్చి అధికారులు చూడగా లాకర్ ఓపెన్ చేసి కనిపించింది. దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
లగచర్ల ఘటనపై రాష్ట్రపతి కార్యాలయం ఆరా తీసినట్టు సమాచారం. దాడికి సంబంధించిన వివరాలను ఇవ్వాలని రాష్ట్రపతి కార్యాలయం బీఆర్ఎస్ను కోరినట్టు తెలిసింది. ఫార్మా విలేజ్కు భూసేకరణ విషయంలో లగచర్ల గ్రామస్థులపై పోలీసులు ప్రవర్తించిన తీరును, వార్త కథనాలను రాష్ట్రపతి కార్యాలయానికి బీఆర్ఎస్ అందించినట్టు సమాచారం.
తెలంగాణ గడ్డపై సూర్య, చంద్రులు ఉన్నంత వరకూ ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజలు, ఆడబిడ్డలకు సంక్షేమ పథకాలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే తాను టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రిని అయ్యానని రేవంత్ రెడ్డి చెప్పారు.
నగరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా నిరసన తెలిపేందుకు దళిత సంఘాల నాయకులు పెద్దఎత్తున సిద్ధమయ్యారు.