Home » Telangana » Rangareddy
దేశం మొత్తం కొడంగల్ వైపు చూసేలా అభివృద్ధి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. కొడంగల్ను ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తామని ఉద్ఘాటించారు.
వికారాబాద్ జిల్లాలోని పరిగి పట్టణం బీసీ కాలనీలో గురువారం ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వీధి పందుల విషయంలో తలెత్తిన చిన్న వివాదం కాస్తా, ప్రాణాలు తీసే స్థాయికి చేరుకుంది.
నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి)లో తీవ్ర విషాదం నెలకొంది. స్థానిక సుద్దవాగులో పడి ఇద్దరు యువకులు మృతిచెందారు.
మద్యం మత్తులో ఇద్దరు యువకులు వీరంగం సృష్టించారు. ఏకంగా ఆర్టీసీ సిబ్బందిపైనే దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
వికారాబాద్ జిల్లాలో లంచం కేసు తీవ్ర కలకలం రేపింది. తాజాగా జరిగిన పరిణామాల ప్రకారం.. వికారాబాద్ మహిళ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సీఐ, ఎస్ఐలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ చర్యలు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడుల అనంతరం తీసుకున్నారు.
నమ్మించి మోసగించడం కేసీఆర్ నైజమని నాగర్కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ మల్లు రవి అన్నారు.
మార్కెట్లో కనీస ధర లేక ఉల్లి రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. హైదరాబాద్లోని మలక్పేట్ మార్కెట్కు పంటను తరలిస్తే క్వింటాల్కు రూ.150 నుంచి రూ.300 మాత్రమే పలుకుతోందని లబోదిబోమంటున్నారు.
సంగారెడ్డి జిల్లాలోని గడ్డపోతారం పారిశ్రామికవాడలో భారీ పేలుడు సంభవించింది. ఎరిత్రో ఫార్మా కంపెనీలో అకస్మాత్తుగా రియాక్టర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనతో పరిశ్రమ ప్రాంగణం అంతా మంటల్లో చిక్కుకోగా, దట్టమైన పొగ పరిసర ప్రాంతాలను కమ్మేసింది.
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధి డబిల్పూర్లో ప్రమాదవశాత్తూ ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. సరదాగా ఈత కొట్టేందుకు చెరువులో దిగి ప్రాణాలు కోల్పోయారు.
మేడ్చల్ జిల్లా మల్లాపూర్ పారిశ్రామిక ప్రాంతంలో నాచారం ఎక్సైజ్ పోలీసులు మెరుపు దాడి జరిపారు. పారిశ్రామిక ప్రాంతాలను, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు.