సీఎం కేసీఆర్(CM KCR) ముందు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(TPCC Revanth Reddy) ఓ బచ్చా అని హోం మంత్రి మహమూద్ అలీ(Mahamood Ali) ఎద్దేవా చేశారు. జిల్లా కేంద్రంలోని ఓ కన్వెన్షన్ హాలులో జరిగిన మైనారిటీల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడుతూ.. రేవంత్ ఆర్ఆర్ఎస్ మనిషని.. కాంగ్రెస్ కండువా వేసుకున్న బీజేపీ(BJP) కోవర్ట్ అని ఆరోపించారు.
తొడలు కొట్టి భుజాలు ఎగిరేసిన వాళ్లు కేసీఆర్ వస్తుండడంతో ముఖం చాటేశారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మాచారెడ్డి మండల కేంద్రంలో రామారెడ్డి, మాచారెడ్డి మండలాల కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. కేసీఆర్ మీద పోటీ చేసేందుకు భయపడుతున్నారన్నారు. కొడంగల్లో గెలవలేని రేవంత్ రెడ్డి కామారెడ్డిలో గెలుస్తాడా అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డిలో బీఆర్ఎస్ షాక్ తగిలింది.
కామారెడ్డి: గతంలో కరెంట్, నీళ్ళు లేక ఎన్నో బాధలు పడ్డామని, ఇప్పుడా బాధలు లేవని, 2004లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే మనం ఇంకా చాలా బాగా ఉండే వాళ్ళమని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు.
ఎల్లారెడ్డి కాంగ్రెస్లో ముసలం నెలకొంది. కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో ఆ పార్టీ నేత సుభాష్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ( BRS Party ) లోని పలువురు కీలక నేతలు పార్టీని వీడారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు కీలక నేతలు పార్టీకి బిగ్ ఝలక్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) లో చేరారు
రైతుబంధు పథకాన్ని అపాలని కేంద్ర ఎన్నికల కమిషన్కి కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం ఇవ్వడం సరైంది కాదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ( Speaker Pocharam Srinivasa Reddy ) అన్నారు.
గజ్వేల్లో మాజీమంత్రి , బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్పై సీఎం కేసీఆర్ ఓడిపోతారని బీజేపీ నిజామాబాద్ ఎంపీ అరవింద్ ( MP Arvind ) అన్నారు.
బీసీలకు కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) అన్యాయం చేసిందని ఎమ్మెల్యీ కల్వకుంట్ల కవిత ( MLC Kalvakuntla Kavitha ) అన్నారు.
బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మూడు ఒక్కటే అని ప్రజాశాంతి వ్యవస్థాపకులు కేఏపాల్ అన్నారు.