నిజామాబాద్ జిల్లా: సిరికొండలో అర్ధరాత్రి కత్తి పోట్ల కలకలం రేగింది. గత కొంత కాలంగా రేషన్ బియ్యం దందా చేస్తున్న ఆన్సర్, రహీం అనే వ్యక్తుల మధ్య వివాదం జరిగింది. తనకు 22 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉందని రహీంతో ఆన్సర్ గొడవ పడ్డాడు.
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్(Chandrababu Naidu Illegall Arrested)పై మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి(Sudarshan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ: తెలంగాణ సమాజం కల్వకుంట్ల కుటుంబం మాటలు నమ్మే పరిస్థితి లేదని, ప్రధాని మోదీ వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ వక్రీకరించి విమర్శిస్తున్నారని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలను సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి వర్చువల్ పద్ధతిన శుక్రవారం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కామారెడ్డి మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రొజెక్టర్ ద్వారా స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు హన్మంత్షిండే, జాజాల సురేందర్, జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ శ్రీనివాస్రెడ్డిలు వీక్షించారు. అంతకు ముందు స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి వైద్య కళాశాల లెక్చరర్ గ్యాలరీకి పూజా కార్యక్రమం చేసి ప్రారంభించారు.
జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. మలేరియా, డెంగ్యూ, వైరల్ జ్వరాలతో రోజురోజుకూ జిల్లా ప్రజలు హడలెత్తిపోతున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని చెబుతున్నప్పటికీ ప్రజలు శ్రద్ధ చూపకపోవడం వల్లనో లేదా క్షేత్రస్థాయి అధికారుల అలసత్వం వల్లనో దోమకాటు, వైరల్ ఫీవర్, విష జ్వరాలతో జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
తెలంగాణలో ప్రారంభించిన మెడికల్ కళాశాలకు కేంద్ర ప్రభుత్వం(Central Govt) గ్రాంట్ ఇచ్చిందని ఎంపీ ధర్మపురి అరవింద్(MP Dharmapuri Arvind) వ్యాఖ్యానించారు.
జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రే.. బతికున్న కూతురికి పెద్దకర్మ చేసిన ఘటన ఆశ్చర్యానికి గురిచేసింది.
ప్రజాస్వామిక పాలన కోసం మరోసారి పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రోటరీ క్లబ్లో ఉద్యమకారులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలోని అనేక సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ కోదండరాం, మాజీ మంత్రి షబ్బీర్అలీలు హాజరయ్యారు.
భవిష్యత్తులో కామారెడ్డి గజ్వేల్ తరహాలో అభివృద్ధి చెందడం ఖాయమని వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేయడం ఇక్కడి ప్రజల అదృష్టమని రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. కేసీఆర్ కామారెడ్డికి వస్తే జిల్లాలోని ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాలు కూడా ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని జిల్లా మొత్తం సమగ్ర అభివృద్ధి బాట పడుతుందని అన్నారు.
రాష్ట్రంలో వైద్య విద్యతో పాటు ప్రజలకు మెరుగైన వైద్యాన్ని దగ్గర చేయాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 9 జిల్లాల్లో మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయగా అందులో కామారెడ్డి సైతం ఉంది. దేవునిపల్లి వద్ద ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలతో పాటు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో అదనంగా ఏర్పాటు చేసిన అనుబంధ ఆసుపత్రి 330 పడకలతో సిద్ధం అయింది. ఈ కళాశాలను గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు.