Telangana: జిల్లాలోని బిక్కనూరు మండలం సిద్దరామేశ్వరనగర్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.
కామారెడ్డి జిల్లా: పల్వంచ మండలం, భవానిపేట గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి అనే వ్యక్తి సైబర్ వలలో చిక్కుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సైబర్ కేటుగాళ్లు వెంకట్ రెడ్డికి ఫోన్ చేశారు. అమెరికాలో ఉంటున్న మీ కుమార్తె మాధవి ఆపదలో ఉందని.. బెదిరింపు కాల్ చేశారు. ఆమె ఉంటున్న గదిలో మరో అమ్మాయి హత్యకు గురైందంటూ ఈ కేసు నుంచి మీ కూతురును తప్పించాలంటే రెండు లక్షలు ఖర్చవుతుందని, డబ్బులు పంపాలంటూ ఫోన్ చేశారు.
మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. నిజామాబాద్లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో నిజామాబాద్ బైపాస్ రోడ్డులోని వ్యవసాయ క్షేత్రంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
D Srinivas Passes Away : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీ శ్రీనివాస్(Dharmapuri Srinivas) భౌతిక కాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నివాళులర్పించారు. ఆదివారం ఉదయం నిజామాబాద్లోని(Nizamabad) డీఎస్ నివాసానికి చేరుకున్న సీఎం రేవంత్.. ఆయన పార్థీవదేహాన్ని సందర్శించారు. నివాళులర్పించి..
బాన్సువాడ(Banswada) మండలం తిర్మలాపూర్(Tirmalapur)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త రాములును మామ నారాయణతో కలిసి భార్య మంజుల హత్య చేసింది. గొడ్డలితో దారుణంగా నరికి చంపి ఇంటి వెనక గోతిలో పాతిపెట్టారు.
కామారెడ్డి: జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకుంది. బీబీపేట మండల కేంద్రానికి చెందిన వీణ(35) అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వీణకు సిద్దిపేటకు చెందిన శ్రావణ్ కుమార్తో 2015లో వివాహం జరిగింది.
తెలంగాణను(Telangana) సాధించిన పార్టీ.. అప్రతీహతంగా పదేళ్లు రాష్ట్రాన్ని ఏలిన పార్టీ బీఆర్ఎస్కు(BRS) గడ్డుకాలం నడుస్తోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు.. ఆ పార్టీ ఉనికినే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మార్చేశాయి. 39 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా.. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.
బీఆర్ఎస్ పార్టీకి(BRS Party) బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీలో కీలక నేత అయిన బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి(Pocharam Srinivas Reddy) కాంగ్రెస్లో(Congress) చేరారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
కామారెడ్డి, మే 24: సాధారణంగా విద్యుత్ షాక్(Electric shock)తో ఒకరిద్దరూ మృతిచెందుతున్న ఘటనలు మనం తరచూ చూస్తుటాం... కానీ గ్రామ పంచాయతీలోని ప్రతి ఇంటికీ విద్యుత్ షాక్ వచ్చిన ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్(Kondapur) గ్రామపంచాయతీ పరిధిలోని పలుగుట్ట తండాలో చోటు చేసుకుంది.
రంగారెడ్డి జిల్లా: ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాండూర్, కామారెడ్డిలలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు పఠాన్చెరు కార్నర్ మీటింగ్లో పాల్గొననున్నారు.