మెదక్: జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ(బుధవారం) పర్యటించనున్నారు. నేడు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు కొల్చారం మండలం ఘనపూర్కు సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు.
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మెదక్ జిల్లాలో పర్యటించారు. మెదక్ చర్చి ప్రారంభమై 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం నుంచి వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో మెదక్ చర్చిని గవర్నర్ సందర్శించారు.
సంగారెడ్డి జిల్లా: లగచర్ల కేసులో అరస్టయి నెల రోజుల పాటు జైళ్లలో ఉన్న 16 మంది రైతులు శుక్రవారం ఉదయం సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యారు. రైతులు జైలు నుంచి బయటకు రాగానే గిరిజన సంఘాలు వారికి ఘనస్వాగతం పలికాయి.
సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి శుక్రవారం లగచర్ల రైతులు విడుదల కానున్నారు. కాగా నాంపల్లి స్పెషల్ కోర్టు బుధవారం రైతులకు బెయిలు మంజూరు చేసింది. గురువారం జైలు అధికారులకు ఆలస్యంగా బెయిలు పత్రాలు అందాయి. దీంతో నిన్న రైతులు విడుదల కాలేదు. ఈ రోజు విడుదలవుతారు.
ఓట్ల కోసం కాంగ్రెస్ నేతలు బీఆర్ అంబేద్కర్ వారసులమని చెప్పుకుంటున్నారని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్రావు ధ్వజమెత్తారు. అంబేద్కర్ నడయాడిన ప్రాంతాలను పంచ తీర్ధ్గా బీజేపీ సర్కార్ అభివృద్ధి చేసిందని తెలిపారు. పార్లమెంట్లో జరిగిన దాడికి తాను ప్రత్యక్ష సాక్షిని అని ఎంపీ రఘునందన్రావు పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ పోరాటం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఉద్యమంలో ఆయన పాటలు ఎంతో ప్రత్యేకమని మాజీ మంత్రి చెప్పారు.
డ్రగ్స్ మాఫియా మరోసారి పడగ విప్పింది. ఇక్కడి మార్కెట్పై డ్రగ్స్ ముఠాలు కన్నేశాయి. ఎన్నిసార్లు ఎంతమందిని అరెస్టు చేసినా.. భాగ్యనగరానికి అంటుకున్న డ్రగ్స్ మత్తు వదలడంలేదు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ.. అధికారుల కళ్లుగప్పి అక్రమంగా స్మగ్లింగ్కు తెరలేపుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లకు గ్రీన్ ఛానెల్లో డబ్బులు ఇస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోందని, కానీ ఆరు నెలల నుంచి మెస్ ఛార్జీలు చెల్లించలేదని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. హాస్టల్ వార్డెన్లు అప్పులు చేసి మరీ విద్యార్థులకు భోజనం పెడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. మె
Telangana: ‘‘నేను చిన్నప్పటి నుంచి సిద్దిపేటలోనే చదువుకున్న, కళాకారుడిగా మాత్రమే నా పాత్ర. అమరజ్యోతి, తెలంగాణ తొలి శకటం కూడా నేనే ఏర్పాటు చేశాను. ఆర్టిస్టులు డబ్బుల కోసం చేస్తున్నారని అని సిధారెడ్డి మాట్లాడటం సరికాదు’’ తెలంగాణ తల్లి విగ్రహ శిల్పి ఎంవీ రమణారెడ్డి అని అన్నారు.
రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో శాసనసభ ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. పార్టీ అగ్రనేతల మాటలు విశ్వసించి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని ఆయన చెప్పారు.