కాంగ్రెస్ నాయకులు పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఎలక్షన్లో ఇచ్చిన హామీలు అట్టర్ ప్లాఫ్ అవుతున్నాయని ఎద్దేవా చేశారు.
అందాల పోటీలు పెట్టీ ఇంగ్లాండ్ అమ్మాయిని రేవంత్ దోస్తులు ఇబ్బంది పెట్టితే ఆమె పారిపోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గుర్తు చేశారు. మహిళల పట్ల రేవంత్ రెడ్డి దోస్తులు అనుచితంగా ప్రవర్తించారని నిప్పులు చెరిగారు.
BRS: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కనకయ్య కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చామని, ఇచ్చిన మాట ప్రకారం పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేశామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు.
Hospital power cut: జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో రోగులకు డాక్టర్లు సెల్ ఫోన్, టార్చిలైట్ వెలుతురులో ఆపరేషన్లు చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. ఈ ఘటన ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించింది.
కమ్యూనిస్టులు, కాంగ్రెస్ మేధావులు మర్చిపోయినటువంటి చరిత్రను బీజేపీ పార్టీ పరిచయం చేస్తుందని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు తమపై దండయాత్ర చేస్తే ఊరుకునేది లేదని రఘునందన్ రావు హెచ్చరించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి అన్ని విషయాలు ప్రజలకు తెలుసునని మాజీమంత్రి హరీష్రావు వెల్లడించారు. కాళేశ్వరంతో ఉపయోగం లేదని అన్నోళ్లకి పండిన పంట తెలియదా అని ప్రశ్నల వర్షం కురిపించారు. కాలేశ్వరం జలాలతో చెరువులు మత్తళ్లు పారుతున్నాయని తెలిపారు.
భారతదేశం అంతర్ యుద్ధం లేకుండా ఉంది అంటే అంబేద్కర్ ముందు చూపు వల్లే సాధ్యమైందని మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. బడుగు, బలహీనవర్గాల్లోని ప్రజలకు అంబేద్కర్ తన చదువును ఉపయోగించి భారత రాజ్యాంగాన్ని రచించి అందరికీ దారి చూపించారని హరీష్రావు చెప్పారు.
Harish Rao Slams Govt: కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. అందాల పోటీలకు కోట్లల్లో ఖర్చు చేస్తున్న సర్కార్.. రైతుల సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
CM Revanth: జహీరాబాద్ పారిశ్రామికవాడ భూసేకరణలో అన్యాయం జరిగిందని తన దృష్టికి వచ్చిందని సీఎం రేవంత్ అన్నారు. జహీరాబాద్ నిమ్జ్లో భూములు కోల్పోయిన 5,612 కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు.
ఓ జవాన్ దేశం కోసం సరిహద్దుల్లో పోరాడుతుంటే.. ఆయన సొంత జిల్లాలో మాత్రం జవాన్కు అన్యాయం జరుగుతోంది. జవాన్కు చెందిన భూమిని కబ్జా చేశారు కొందరు వ్యక్తులు.