మణుగూరు(Manuguru)లో భారీగా గంజాయి(Ganja) పట్టుపడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డొంకరాయి (Donkarayi) నుంచి మణుగూరు మీదుగా మామిడికాయల మాటున ట్రాలీలో హైదరాబాద్కు తరలిస్తుండగా 477కేజీలను స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.1.19కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
ములుగు జిల్లా: వాజేడు మండలంలో మందు పాతర పేలి వ్యక్తి మృతి చెందాడు. పోలీసులే లక్ష్యంగా అమర్చిన మందు పాత్ర పేలి వ్యక్తి మృతి చెందిన సంఘటన ములుగు జిల్లా వాజేడు మండలంలో చోటుచేసుకుంది.
ఖమ్మం జిల్లా: పేదవారి ప్రభుత్వం వచ్చిన తరువాత రోహిణి కార్తెలోనే వర్షాలు కురుస్తున్నాయని, అనేక కష్టాలు, నష్టాలు పడి తనను మంచి మెజారిటీతో గెలిపించారని, మీరిచ్చిన అవకాశంతోనే తాను ఈస్థాయిలో ఉన్నానని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
జూలూరుపాడు మండలం వినోబానగర్ గ్రామంలో తాగునీటి విపరీతంగా ఉందని.. బుక్కెడు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థలు ఆందోళనకు దిగారు.
రఘునాథపాలెం మండలం హర్యాతండాలో నిన్న జరిగిన కారు ప్రమాద ఘటనపై మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. భర్తే హత్య చేసి రోడ్డుప్రమాదంగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపిస్తూ మృతురాలు కుమారి కుటుంబ సభ్యులు ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
Telangana: ఈనెల 27న ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని... బీజేపీ అభ్యర్థిగా 40 ఏళ్లుగా సిద్ధాంతాన్ని నమ్ముకుని ఎత్తిన జెండా దింపని గుజ్జుల ప్రేమెందర్ రెడ్డిని ఎమ్మెల్సీ బరిలో నిలిపామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులను ఆనాడే ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించినా నేటికీ అమలు చేయకపోవడం పట్ల వారు బాధతో ఉన్నారన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలు చెల్లింపు విధానంతో మళ్ళీ ఆర్టీసీని దివాలా తీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మరోసారి సందడి చేశారు. కేసులతో బిజీగా ఉన్న ఆయన రిలాక్స్గా తెలుగు పాటలకు మాస్ స్టెప్లేసి ఆదరగొట్టారు. ఎస్పీ డ్యాన్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
Telangana: ‘‘గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడి నా గెలుపు కోసం శ్రమించి పనిచేసి అద్భుతమైన మెజారిటీతో గెలిపించారు. మీ ఇంటి పెద్దకొడుకుగా మీ అందరి కోసం పనిచేస్తా’’ అని రెవిన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం నేలకొండపల్లి మండలం గువ్వలగూడెంలో నిర్వహించిన ప్రజల వద్దకె శ్రీనన్న కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ..
ఖమ్మం జిల్లా: ఖమ్మం రూరల్ మండలం, రెడ్డిపల్లి, పోలేపల్లిలో నిర్వహించిన ప్రజా సమస్యలపై ప్రజల వద్దకే శ్రీనన్న కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రజలనుంచి మంత్రి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ సచివాలయంలోని తన ఛాంబర్లో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. మార్కెంటింగ్,జౌలి, ఆహార శుద్ధి ఏర్పాట్లు, అకాల వర్షాలు, పంట నష్టాలపై మంత్రి సమీక్షించారు.