మణుగూరు మండలం బావి కూనవరం(Bavi Koonavaram) గ్రామానికి చెందిన పద్మ శ్రీ అవార్డు గ్రహీత(Padma Shri awardee) సకిని రాంచంద్రయ్య (Sakini Ramchandraiah) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో స్వగ్రామంలోనే ఆయన ప్రాణాలు వదిలినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
తెలంగాణ ప్రాంతానికి ఉన్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి..ఈ సంస్థ తెలంగాణకు తలమానికమని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అన్నారు.
ప్రాణపాయంలో ఉన్న యువకుడికి గ్రామీణ వైద్యుడు రాంబాబు సీపీఆర్ చేసి యువకుడి ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన బల్లేపల్లిలో జరిగింది. వైద్యుడు సకాలంలో స్పందించి సీపీఆర్ చేయడంతో యువకుడికి ప్రాణపాయం తప్పింది. దీంతో వైద్యుడికి స్థానికులు అభినందనలు తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి మండలం పూసగూడెం వద్ద సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ను తెలంగాణ మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు(గురువారం) పరిశీలించారు.
ఖమ్మం జిల్లా: గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పేదోడి కష్టం తీర్చే ప్రభుత్వం రావాలని ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారని, ఎన్నికల సమయంలో ప్రజలు చెప్పిన సమస్యలు తీర్చేందుకే ప్రజల మధ్యకు వచ్చానని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
జూన్ 12న రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కానున్నట్లు రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) తెలిపారు. ఈ మేరకు ఆయన పాఠశాలల పునఃప్రారంభం సహా పలు అంశాలపై కొత్తగూడెం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఖమ్మం జిల్లా: గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అనర్హులు పైరవీలు చేసి పెన్షన్ తీసుకుంటే వాటన్నింటినీ ఆపేస్తామని రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన తిరుమలాయపాలెంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ..
వైరా (Wyra) మండలం పాలడుగు సమీపంలో కారు అదుపుతప్పి (Car Accident) చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా దాచేపల్లి వాసులుగా గుర్తించారు.
ఖమ్మం జిల్లా: రూరల్ మండలం పొన్నెకల్లులోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఖమ్మం పార్లమెంట్ కౌంటింగ్ ప్రక్రియ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఖమ్మం లోక్ సభ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సంబంధించి అభ్యర్థులు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో అబ్జర్వర్లు ఎన్నికల అధికారులు స్ట్రాంగ్ రూములు ఓపెన్ చేశారు.
సత్తుపల్లి(Sathupally) మండలం కిష్టారం(Kishtaram) ఓసీ వద్ద ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని లారీ(Lorry) ఢీకొట్టడంతో తండ్రి, కుమారుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు కిష్టారం గ్రామానికి చెందిన పిల్లి పేరయ్య(52), కుమారుడు అశోక్(30)గా గుర్తించారు.