భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాగార్జున సాగర్ ఆయకట్టుకి గోదావరి జలాలు తరలించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జిల్లాలోని 6.74లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు తుమ్మల తెలిపారు.
సీతారామ ప్రాజెక్టును ఆగస్టు 15, 2026నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి కృష్ణా పరీవాహక ప్రాంతానికి నీళ్లు తరలించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని వారు ఉద్ఘాటించారు. ప్రాజెక్టు మూడు పంప్ హౌస్లు ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రులు మీడియాతో మాట్లాడారు.
భద్రాద్రి కొత్తగూడెం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి సీతారామ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేస్తారు. ముల్కలపల్లి మండలం, పూసుగూడెం వద్ద ప్రాజెక్ట్ పైలాన్ ఆవిష్కరణ చేసి పంప్ హౌస్ మోటార్లు స్విచ్ ఆన్ చేస్తారు. అనంతరం డెలివరి సిస్టర్న్ వద్ద గోదారమ్మకు సీఎం రేవంత్ రెడ్డి పూజలు చేస్తారు.
Telangana: జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. దశాబ్దాల సాగు నీటి కల సాకారం చేసే సీతారామ ప్రాజెక్ట్ను రేపు (ఆగస్టు 15) ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేయనున్నారు. ముల్కలపల్లి మండలం పూసుగూడెం వద్ద పైలాన్ ఆవిష్కరించనున్నారు.
Telangana: ఖమ్మం జిల్లా రఘునాథ పాలెంలో సొంత మనవడినే అమ్మేసింది నాయనమ్మ. మనవడిని దత్తత పేరుతో హై డ్రామాకు తెరతీసింది. ఖమ్మంలో ఓ కార్పొరేటర్ భర్త సహకారంతో హైదారాబాద్వాసికి దాదాపు రూ. 5 లక్షలకు అమ్మకానికి పెట్టేసింది.
Telangana: ఖమ్మం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి వైరా బహిరంగ సభ సన్నాహక సమావేశంలో మంత్రి తుమ్మల మీడియాతో మాట్లాడుతూ... గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేయాలనే సీతారామ ప్రాజెక్ట్కు రూపకల్పన చేశామన్నారు. గత ప్రభుత్వం 8 వేల కోట్లతో నిర్మించిన సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ మోటార్లు పాడవకుండా సద్వినియోగం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
సీతారామ ప్రాజెక్టు విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల ఆవేదన వ్యక్తం చేశారు. ఒకానొక దశలో కంటతడి పెట్టుకున్నారు. ప్రచారం కోసం బటన్లు నొక్కే వ్యక్తిని తాను కాదని స్పష్టం చేశారు.
Telangana: జిల్లాలో తెలంగాణ మంత్రుల పర్యటన కొనసాగుతోంది. సోమవారం ఉదయం నేలకొండపల్లి బౌద్ధ స్థూపంని సందర్శించిన మంత్రులు.. అనంతరం ఖమ్మం ఖిల్లాను సందర్శించారు. మంత్రులు భట్టివిక్రమార్క, తుమ్మల నాగేశ్వరావు, జూపల్లి కృష్ణారావు, ఖమం ఎంపీ రఘురాంరెడ్డి ఖిల్లాను సందర్శించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... ఖమ్మం జిల్లాలో టూరిజం అభివృద్దికి ప్రత్యేక కృషి జరుగుతోందన్నారు.
ఖమ్మం జిల్లా: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక స్థలలను ప్రపంచ పటంలో ఉంచాలని, వాటిని ప్రాచుర్యంలోకి టీసుకొచ్చి బుద్దిస్ట్లను ఇక్కడికి తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. సోమవారం పాలేరు నియోజకవర్గం, నేలకొండపల్లి మండల కేంద్రంలోని బౌద్ధ స్థూపాన్ని డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు.
Telangana: జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండల కేంద్రంలోని బౌద్ధ స్తూపాన్ని డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం ఉదయం సందర్శించారు. అనంతరం బౌద్ధ స్తూపం వద్ద పర్యాటక అధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్షా సమావేశం నిర్వహించారు.