హైదరాబాద్: వారం రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ మృతి చెందారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట ఎస్ఐగా విధులు నిర్వహిన్నారు.
ప్రజాసమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న యోధుడు అంజద్ ఉల్లా ఖాన్ అని నేతాజీ యువజన సంఘం అధ్యక్షుడు ఎస్.జె.కె.అహ్మద్ పేర్కొన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఏపీలో విలీనమైన గ్రామాలను తిరిగి భద్రాచలం (Bhadrachalam)లో కలపాలని స్థానిక నేతలు, ప్రజలు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao)ను కోరారు. ఈ మేరకు భద్రాచలం విలీన గ్రామాల నేతలు హైదరాబాద్లోని మంత్రి నివాసంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
Telangana: మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. అప్పటి వరకు తమముందు ఎంతో ఆనందంగా ఉన్న వారు హఠాత్తుగా మరణిస్తుంటారు. అలాంటి ఘటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. ఎంతో శ్రద్ధగా చదువుకుంటున్న ఓ చిన్నారి.. అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా నవ్యాంధ్రప్రదేశ్లో విలీనమైన భద్రాచలం మండలంలోని ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేసేలా చొరవ తీసుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. ఈనెల ఆరో తేదీన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ నేపథ్యంలో లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
చింతకాని మండలం పొద్దుటూరు (Podhuturu) గ్రామానికి చెందిన రైతు బొజెడ్ల ప్రభాకర్(Bojedla Prabhakar) ఆత్మహత్య ఘటనపై వ్యవసాయ శాఖ మంత్రి (Agriculture Minister) తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswara Rao) తీవ్రంగా స్పందించారు. రైతు ఆత్మహత్యపై తక్షణమే విచారణ జరిపి నివేదిక అందజేయాలని రెవెన్యూ, పోలీస్ అధికారులను ఆదేశించారు.
మణుగూరు-పినపాక మండలాల సరిహద్దున ఉన్న భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం(బీటీపీఎస్)లో అగ్నిప్రమాదంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్షా సమావేశం నిర్వహించారు. మధిర క్యాంపు కార్యాలయంలో ఇవాళ(ఆదివారం) సాయంత్రం నిర్వహించిన సమీక్షలో జెన్కో థర్మల్ డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. పిడుగుపాటు వల్ల జరిగిన అగ్నిప్రమాదంలో వాటిల్లిన నష్టం వివరాలను అధికారులను అడిగి డిప్యూటీ సీఎం తెలుసుకున్నారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్టేట్మెంట్లు చూస్తే అబద్ధాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మించిపోయారని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) విమర్శించారు. ఎంఎండీఆర్ పేరుతో చట్టం ఏర్పాటు చేసి ఆ గనులను ప్రైవేట్ సంస్థలకు విక్రయిస్తున్నారన్నారు.
భద్రాద్రి పవర్ ప్లాంట్ ఒకటో యూనిట్పై పిడుగు పడింది. పిడుగు పాటుకు 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి షట్ డౌన్ అయింది. జనరేషన్ ట్రాన్స్ఫార్మర్లో మంటలు చెలరేగినట్లు ప్లాంట్ అధికారులు చెబుతున్నారు.
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారిని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Deputy CM Mallu Bhatti Vikramarka) దంపతులు ఈరోజు(మంగళవారం) దర్శించుకున్నారు.ఆలయ మర్యాదలతో ఆలయ ఈవో పెద్దిరాజు, అర్చకులు స్వాగతం పలికారు.