ఖమ్మం జిల్లా: నేలకొండపల్లి మండలం, గువ్వలగూడెంలో రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం పర్యటిస్తున్నారు. ఈ సందర్భగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి నూతనంగా నిర్మించిన హెల్త్ సబ్ సెంటర్ను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. విద్య వైద్యకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం చేపట్టిందని చెప్పారు.
Telangana: జిల్లాలోని సీతారామ ప్రాజెక్ట్లో మరో కీలక ఘట్టం విజయవంతమైంది. సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ 2 ట్రయిల్ రన్ సక్సెస్ అయ్యింది. ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ పేస్ 2 విజయవంతంగా ట్రయల్ రన్ పూర్తి అయ్యింది. గోదావరి జలాలను అధికారులు దిగువకు విడుదల చేశారు. బాహుబలి మోటర్లు ఆరు ఉండగా ఒక మోటర్తో పదిహేను వందల క్యూసెక్కుల నీటిని ట్రయల్ ద్వారా
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం వద్ద గోదావరి పరవళ్ళు తొక్కుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53.40 అడుగుల వద్ద 14,45,047 క్యూసెక్కుల వరద ప్రవాహిస్తుండడంతో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. రహదారులపై వరద నీరు పోటెత్తడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం ఏజెన్సీ జల దిగ్బంధంలో చిక్కుకుంది.
భద్రాద్రి కొత్తగూడెం: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరి పరవళ్ళు తొక్కుతోంది. మూడో ప్రమాద హెచ్చరిక దిశగా గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. 51.10 అడుగుల వద్ద 13,18,860 క్యూసెక్కుల వరద ఉధృతి పెరిగింది. 53 అడుగులు దాటగానే మూడో ప్రమాద హెచ్చరిక జారీ కానుంది.
తెలంగాణలో సాధ్యమైనంత త్వరగా రెండో విడత రైతు రుణమాఫీ అమలు చేయుటకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి(Agriculture minister) తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao) తెలిపారు. రుణమాఫీ-2024లో మొదటి విడతగా లక్ష లోపు రుణాలకు సంబంధించి 11.50లక్షల కుటుంబాలకు రూ.6,098.94 కోట్లు విడుదల చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు.
భద్రాద్రి కొత్తగూడెం: పెద్దవాగు ఘటన చాలా బాధాకరమని, ప్రాజెక్ట్ ఆనకట్ట తెగిన సమాచారం తెలియగానే ఎంతో తల్లడిల్లిపోయానని, హెలి కాఫ్టర్ ఆలస్యం అయితే ఏమైనా ప్రాణ నష్టం వాటిల్లిందని ఎంతో మదన పడ్డానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
ములుగు జిల్లా: డీఎంహెచ్వో డా. అప్పయ్య తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆదివాసులకు వైద్యం అందించారు. కొండ కోణల్లో ఉండే గిరి పుత్రులు జ్వరాలతో బాధ పడుతూ మెరుగైన వైద్యానికి నోచుకోక.. వారు బయటకు రాలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి అప్పయ్య నేరుగా తానే ఆదివాసుల దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
రఘునాథపాలెం మండలం హరియాతండా వద్ద మృతిచెందిన ముగ్గురి అనుమానాస్పద కేసును పోలీసులు ఛేదించారు. మే 28న జరిగిన రోడ్డుప్రమాదంపై మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నారని డాక్టర్ ప్రవీణ్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలను చంపి రోడ్డుప్రమాదంగా చిత్రీకరించాడని విచారణలో తేల్చారు. కేసుకు సంబంధించిన వివరాలను ఏసీపీ రమణమూర్తి వెల్లడించారు.
రూరల్ మండలం తనగంపాడు(Thanagampadu) పత్తి చేలల్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) పర్యటించారు. ఈ సందర్భంగా మహిళా రైతు కూలీలను వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తు్న్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆయన ఆరా తీశారు.
KCR ప్రభుత్వంలో పేపర్ లీకేజీలతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) తెలిపారు. రాష్ట్ర ప్రజలు, నిరుద్యోగ , యువతీ యువకులకు భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు.