ఖమ్మం జిల్లా బోనకల్లో గుడి ముందు భిక్షాటన చేసుకునే ఓ యాచకుడికి ఐపీ (దివాలా దరఖాస్తు) నోటీసు రావడం చర్చనీయాంశమైంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం..
Telangana: బీజేపీపై సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం విమర్శలు గుప్పించారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టె పని బీజేపీ చేస్తోందని ఆరోపించారు. వాగ్ధానాలను అమలు చేయలేని స్థితిలో బీజేపీ ఉందన్నారు. ఈ విధానం కొనసాగితే దేశం విచ్ఛినం అవుతుందని అన్నారు.
కాంగ్రెస్ వచ్చాక ధరణిని బంగాళా ఖాతంలో వేస్తాం అని చెప్పామని... చెప్పినట్లుగానే దరణిని మారుస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. విదేశీ కంపెనీ కబంధహస్తాల నుంచి కేంద్రంలోని ఎన్ఐసికి అప్పగిస్తున్నామన్నారు. 2024 కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకు వస్తున్నామని, 15 దేశాల్లోని మంచి రెవెన్యూ అంశాలను తీసుకుని డ్రాఫ్ట్ తయారు చేశామని చెప్పారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళలపై వివక్ష, రాజ్యాంగంపై దాడి, అధిక ధరలతో పెను భారమవుతోందని సీపీఏం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ అన్నారు. జమిలీ ఎన్నికలు కాదు, జనాభాలో సగం మహిళలు, 33 శాతం మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని బృందా కారత్ కోరారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గొల్లగూడెంలోని మానస వికాస్ పాఠశాలలో ఈనెల 16న ఆరో తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయుడు సతీశ్ హోమ్ వర్క్ ఇచ్చారు. నిన్న (గురువారం) ఉదయం విద్యార్థులను ఒక్కొక్కరిగా పిలిచి తాను ఇచ్చిన వర్క్ చెక్ చేశాడు.
మావోయిస్ట్ పార్టీ మహిళా అగ్రనేత సుజాత అలియాస్ కల్పన పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె వైద్యం కోసం కొత్తగూడెంలోని హాస్పిటల్కు రాగా పోలీసులు పట్టుకున్నట్లు తెలియవచ్చింది. కాగా మహబూబాబాద్ బస్టాండ్లో ఆమెను అరెస్ట్ చేసినట్లు మరో ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యూ ఎనర్జీ పాలసీపై కసరత్తు చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. త్వరలోనే రైతుల బోరు బావులకు ప్రభుత్వ ఖర్చుతో సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు.
తెలంగాణ ప్రాంతం ఆయిల్ పామ్ సాగుకు అనువైన ప్రాంతమని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇకపై ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పామాయిల్ సాగు, విస్తరణ పెరుగుతుందని ఆయన చెప్పారు.
ప్రపంచంతో తెలంగాణ బిడ్డలు పోటీపడేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి "యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్"కు శ్రీకారం చుట్టారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమిలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు 10 వేల 6 పోస్టులు డీఎస్సీ ద్వారా ఇచ్చామని చెప్పారు. ఉపాధ్యాయుల బదిలీలతో పాటు ఉద్యోగఉన్నతి ఇందిరమ్మ ప్రభుత్వం కలిపించిందని, గత ప్రభుత్వం అనేక స్కూల్స్ పెట్టిందే తప్ప పక్క వసతి కలిపించడంలో విఫలమైందని ఆరోపించారు.