ఏమ్మా...!మీ ఊర్లో జ్వరాలు ఉన్నాయా... ఏ ఊరు మీది... ఆశా కార్యకర్తలు వస్తున్నారా ఇళ్లకి.. డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారా?’’ అంటూ కలెక్టర్ ముజమ్మిల్ఖాన రోగులను, మహిళలను ఆరా తీశారు. శనివారం ఆయన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భగా క్యాజువాలిటి, ఫార్మసీ, వార్డులు పరిశీలించారు. గర్భిణు
Telangana: రైతు రుణమాఫీపై కలెక్టరేట్ వద్ద రైతు సంఘాలు మంగళవారం ధర్నాకు దిగాయి. విషయం తెలిసిన వెంటనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అక్కడకు చేరుకున్నారు. ధర్నా వద్దకు వెళ్లి రైతు సంఘం నేతలకు రైతులకు రుణమాఫీపై స్పష్టతనిచ్చారు. ఆపై రైతులు తమ ఆందోళనను విరమించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... రైతు రుణమాఫీ అవ్వని రైతులు అపోహ పడొద్దన్నారు.
చర్ల( Charla) మండలం చెన్నాపురం(Chennapuram) అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఘాతుకానికి తెగబడ్డారు. పోలీసులకు కోవర్టుగా మారిందనే సమాచారంతో తోటి మహిళా మావోయిస్టును హత్య చేసి రోడ్డుపై పడేశారు.
Telangana: జిల్లాలోని నేలకొండపల్లి మండల కేంద్రంలోని భక్త రామదాస ధ్యాన మందిర ఆడిటోరియాన్ని రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. భక్తరామదాసు ఇక్కడే జన్మించారని.. ఆయన జన్మస్థలాన్ని యావత్ ప్రపంచానికి తెలియజేయాలని అన్నారు.
తల్లాడ మండలం అన్నారుగూడెంలో 9మంది రైతు కూలీలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పొలంలో మందు చల్లుతూ తగిన జాగ్రత్తలు పాటించకపోవడంతో వారంతా అస్వస్థతకు లోనయ్యారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాగార్జున సాగర్ ఆయకట్టుకి గోదావరి జలాలు తరలించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జిల్లాలోని 6.74లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నట్లు తుమ్మల తెలిపారు.
సీతారామ ప్రాజెక్టును ఆగస్టు 15, 2026నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి కృష్ణా పరీవాహక ప్రాంతానికి నీళ్లు తరలించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని వారు ఉద్ఘాటించారు. ప్రాజెక్టు మూడు పంప్ హౌస్లు ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రులు మీడియాతో మాట్లాడారు.
భద్రాద్రి కొత్తగూడెం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి సీతారామ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేస్తారు. ముల్కలపల్లి మండలం, పూసుగూడెం వద్ద ప్రాజెక్ట్ పైలాన్ ఆవిష్కరణ చేసి పంప్ హౌస్ మోటార్లు స్విచ్ ఆన్ చేస్తారు. అనంతరం డెలివరి సిస్టర్న్ వద్ద గోదారమ్మకు సీఎం రేవంత్ రెడ్డి పూజలు చేస్తారు.
Telangana: జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. దశాబ్దాల సాగు నీటి కల సాకారం చేసే సీతారామ ప్రాజెక్ట్ను రేపు (ఆగస్టు 15) ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేయనున్నారు. ముల్కలపల్లి మండలం పూసుగూడెం వద్ద పైలాన్ ఆవిష్కరించనున్నారు.
Telangana: ఖమ్మం జిల్లా రఘునాథ పాలెంలో సొంత మనవడినే అమ్మేసింది నాయనమ్మ. మనవడిని దత్తత పేరుతో హై డ్రామాకు తెరతీసింది. ఖమ్మంలో ఓ కార్పొరేటర్ భర్త సహకారంతో హైదారాబాద్వాసికి దాదాపు రూ. 5 లక్షలకు అమ్మకానికి పెట్టేసింది.