ఖమ్మంలో రూ. 130 కోట్లతో అద్భుతమైన మెడికల్ కళాశాల నిర్మాణం జరుగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై విద్య, వైద్య ఆరోగ్యశాఖ శాఖలకు కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గత ప్రభుత్వం మొండి గోడలతో వదిలి వెయ్యి కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టిన అన్నిటినీ క్లియర్ చేస్తున్నామన్నారు.
Minister Ponguleti Srinivasa Reddy: మాజీ సీఎం కేసీఆర్పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పు కేసీఆర్ ఘన కార్యమేనని, తమ ప్రభుత్వ ఖాతాలో వేసుకోమని తేల్చిచెప్పారు. తెరిచిన పుస్తకం ఇందిరమ్మ ప్రభుత్వమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉద్ఘాటించారు.
Revenue officials: భద్రాద్రి రామాలయ పరిసరాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఇళ్లను తొలగించే ప్రక్రియ మే మొదటి వారంలో ఆరంభించి పూర్తి చేసేందుకు రెవెన్యూ అధికారులు కసరత్తు చేపట్టారు.
Police Stations in Settlements: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చాలా పోలీస్స్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాగా మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితులకు న్యాయం చేసే పేరుతో నేరుగా స్టేషన్ల వద్దకు పిలిపించి బేరాలు మాట్లాడే పరిస్థితులు ఉన్నట్టు తెలుస్తోంది.
Vanajeevi Ramaiah: పద్మశ్రీ వనజీవి రామయ్య గుండెపోటుతో మృతిచెందారు. కోటికి పైగా మొక్కలు నాటి రామయ్య సరికొత్త చరిత్ర సృష్టించారు. రామయ్య మరణంతో ప్రకృతి ప్రేమికులు శోక సంద్రంలో మునిగిపోయారు.
Sri Rama Pattabhishekam: భద్రాచలంలో శ్రీరామంద్రుడి పట్టాభిషేక మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఈ మహోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు మిథులా స్టేడియానికి తరలివచ్చారు.
సీతా రాముల కల్యాణం అనంతరం ఒక్క రామయ్యకు మాత్రమే నిర్వహించే విలక్షణ ఉత్సవం మహా పట్టాభిషేకం. ఏటా శ్రీరామ నవమి మరుసటి రోజు జరిగే ఉత్సవాన్ని శ్రీరామ మహాపట్టాభిషేకంగా పేర్కొంటారు. ఇందులో భాగంగా శ్రీరాముడికి ఆభరణాలతో పాటు రాజదండం, రాజముద్రిక, ఛత్రం, శంఖు, చక్రాలు, కిరీటం ధరింపజేస్తారు.
భద్రాద్రి సీతారాముల కల్యాణం తిలకించేందుకు లక్షలాది భక్తులు దక్షిణ అయోధ్య బాట పట్టారు. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో సీతారాముల కల్యాణం.. అంగరంగ వైభవంగా జరగింది. ఇందుకోసం మిధిలా స్టేడియం అందంగా ముస్తాబైంది. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం భద్రాద్రి జిల్లాల్లో పర్యటించనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో సీతారామ కల్యాణం కోసం స్వామి వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.
Maoists surrender: మావోయిస్టు పార్టీకి మరోసారి గట్టి ఎదురుదెబ్బ తలిగింది. ఈసారి ఎన్కౌంటర్ పరంగా కాదు.. భారీగా మావోయిస్టుల పోలీసుల ఎదుట లొంగిపోవడమే ఇందుకు కారణం.