Telangana: అమెరికాలో ఖమ్మం యువకుడిపై కాల్పులు కలకలం రేపుతోంది. చికాగోలో దుండగుల కాల్పుల్లో జిల్లాకు చెందిన నూకరపు సాయి తేజ మృతి చెందాడు. నాలుగు నెలల క్రితమే ఉన్నత విద్య కోసం సాయి తేజ అమెరికాకు వెళ్లాడు. చివరకు దుండగుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఖమ్మం రమణగుట్ట ప్రాంతంలో నూకారపు సాయి తేజ కుటుంబం నివాసం ఉంటోంది.
ఖమ్మం జిల్లాలో సీతారామ భక్తరామ దాసు ప్రాజెక్ట్లతో సస్య శ్యామలం చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్ఘాటించారు. ప్రపంచీకరణ నేపథ్యంలో కమ్మ వారు అమెరికాలో రాణిస్తున్నారని తెలిపారు. తోటి కులాలను గౌరవిస్తూ లౌకిక భావనతో కమ్మ కులం ఆదర్శంగా నిలిచిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
మిద్దె తోటలు పెచండంలో ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తుందని.. మహిళలు ముందుకు రావాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. కల్తీ ఆహారం పురుగు మందుల అవశేషాలున్న కూరగాయలు తిని మనిషి కష్టార్జితం అంతా హాస్పిటల్ పాలవుతుందని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని మాజీ మంత్రి హరీష్రావు విమర్శించారు. శుక్రవారం ఖమ్మంలోని పత్తి మార్కెట్కు వచ్చిన ఆయన రైతులతో మాట్లాడారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రైతుబంధు వేయడం లేదని పెట్టుబడికి కష్టంగా మారుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మా కంపెనీల పేరుతో రైతుల భూములు లాక్కోడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నామని హరీష్రావు అన్నారు.
ఖమ్మం మూడో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు చేస్తుండగా ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిపై పోలీసులకు అనుమానం వచ్చింది. వారిని ఆపి ప్రశ్నించే లోపే పోలీసులను చూసి ఇద్దరూ పారిపోయే ప్రయత్నం చేశారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మెుదటి సంవత్సరం విద్యార్థికి గుండు కొట్టించిన ఘటనపై తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేస్తున్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఆపాలని అతడికి సూచిస్తున్నారు. లేకుంటే బీసీలతో చెప్పు దెబ్బలు తినాల్సిన పరిస్థితి తీన్మార్ మల్లన్నకు వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.
రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు 20000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ పాలసీ కోసం విద్యుత్ రంగంలో అపార అనుభవం ఉన్న నిష్ణాతులను, అనుభవజ్ఞుల సలహాలతో ప్రణాళిక సిద్ధం చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.
ఖమ్మం జిల్లా మల్లారం గ్రామానికి చెందిన కొంగర కేశవరావు తన కుమార్తె నూకారాపు సరితను ఖమ్మంపాడుకు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. అయితే ఇటీవల కేశవరావు అనారోగ్యానికి గురయ్యారు.
తెలంగాణలో ఆయిల్ పామ్ సాగుకు 31 జిల్లాల్లో అనుమతులు ఉన్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆయిల్ ఫెడ్తో పాటు 14 ప్రైవేట్ కంపెనీలకు ఆయిల్ పామ్ సాగు విస్తరణ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.