భారతదేశంలోనే ఎక్కువ ఎకరాల్లో పామాయిల్ సాగుచేసే రాష్ట్రంగా తెలంగాణ ముందంజలో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో నూతన విత్తన చట్టాన్ని, భారత రైతాంగానికి శ్రేయస్సు చేకూర్చే విధంగా అంగీకరించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.
అన్నదాతలు ఆత్మ గౌరవంతో ఆరోగ్యంగా ఉండేది ఒక్క వ్యవసాయ రంగమేనని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రానున్న రోజుల్లో రైతులకు మంచి భవిష్యత్ ఉందని ఉద్ఘాటించారు. ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ దేశానికి హబ్గా మారనుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం వద్ద గోదావరి నదిలో వరద ఉధృతి తీవ్రంగా పెరుగుతున్న కారణంగా రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
మున్నేరు పరివాహక ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉన్నందున ముందస్తూ.. చర్యల్లో భాగంగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. ముందుగా ముంపుకు గురి అయ్యే ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు.
ఆరోగ్య సమస్యలతో సీఎంఆర్ఎఫ్ కోసం అప్లై చేసుకున్న బాధితుల వివరాలు మార్చేసిన ముఠా ఆ డబ్బులను వేరే ఖాతాలకు మళ్లించి నొక్కేసిందని ఎస్పీ నరసింహ వివరించారు. గత కొంతకాలంగా సదరు ముఠా పలువురి సీఎంఆర్ఎఫ్ నిధులను కాజేస్తుందని గుర్తించారు.
'మీరు చనిపోయినా మీ కళ్లు అందమైన అమ్మాయిల్ని చూడాలని కోరుకుంటున్నారా! అయితే నేత్రదానం చేద్దాం..' అనేది ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక ప్రకటన సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయిన ఈ ప్రకటన యువతలో నేత్రదానంపై అవగాహన తీసుకొచ్చింది ఈ ప్రకటన. యువతను ఆలోచింప చేసిందనడంలో అతిశయోక్తి లేదు.
కేసీఆర్ని అరెస్ట్ చేయడం కాంగ్రెస్ వల్ల కావడం లేదని, సీబీఐకి అప్పగిస్తే తాము అరెస్ట్ చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ పోటీ పడుతున్నాడని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. గల్లీ నాయకులకు ఢిల్లీ ప్రమోషన్లు వస్తే.. ఇలాంటి పనులే చేస్తారని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ పాలనపై తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వం ప్రాజెక్టలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు.
బీసీ రిజర్వేషన్ విషయంలో తాము చిత్తశుద్ధితో ఉన్నామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఉద్ఘాటించారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ బీసీలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆక్షేపించారు. బీసీలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని రామచంద్రరావు హెచ్చరించారు.
గత ఏడాది కనీవిని ఎరుగని రీతిలో మున్నేటికి వరద ముప్పు రావడంతో వందలాది మంది నిరాశ్రయులుగా మారారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మళ్లీ అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల దిశానిర్దేశం చేశారు.