నిజామాబాద్ పరిధిలోని ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం బీఆర్ఎస్కు చెందిన బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఈ అసెంబ్లీ స్థానంలో మొత్తం 1,94,625 వోట్లరు ఉన్నారు. జిల్లాలోని నిజామాబాద్ రూరల్, జక్రాన్పల్లి, మొపల్, ఇందల్వాయి, సిరికొండ, డిచ్పల్లి, ధార్పల్లి మండలాలు ఈ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. 1952లో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో సోషలిస్టు పార్టీకి చెందిన డి.శ్రీనివాసరావు గెలుపొందారు. 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన బాల్రెడ్డి అనంత్రెడ్డి విజయం సాధించారు. ఆ తరువాత 1983లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీకి చెందిన మండవ ఎం.జె. థామస్ చౌదరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత వరుసగా జరిగిన ఐదు సాధారణ ఎన్నికల్లో టీడీపీకి చెందిన మండవ వెంకటేశ్వర రావు వరుసగా గెలుపొందుతూ వచ్చారు. 2004లో టీఆర్ఎస్ నేత గడ్డం గంగారెడ్డి విజయం సాధించగా 2008 ఎన్నికల్లో కాంగ్రెస్ నేత లలిత విజయం సాధించారు. 2009 నాటి సాధారణ ఎన్నికల్లో టీడీపీ తరపున మండవ వెంకటేశ్వర రావు విజయం సాధించారు. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన తొలి రెండు ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ తరపున బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపొందారు. 2018 నాటి ఎన్నికల్లో ఆయన తన సమీప కాంగ్రెస అభ్యర్థి రేకుపల్లి భూపతిరెడ్డిపై 29,646 వోట్ల మెజారిటితో గెలిచారు. అంతకుముందు జరిగిన తెలంగాణ రాష్ట్ర తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి డీ.శ్రీనివాస్పై 26,547 విజయాన్ని అందుకున్నారు.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |