మహబూబాబాద్ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో డోర్నకల్ ఒకటి. ఎస్టీలకు రిజర్వ్ చేయబడిన ఈ నియోజకవర్గం పరిధిలో నర్సింహులపేట, మరిపెడ, కురవి, డోర్నకల్ మండలాలు ఉన్నాయి. మొత్తం 2,04,783 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,01,644 మంది ఉండగా.. మహిళా ఓటర్లు 1,03,131 మంది ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయక్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2018 ఎన్నికల్లో.. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డీఎస్ రెడ్యానాయక్.. తన సమీప ప్రత్యర్థి జాటోత్ రామ్ చంద్రు నాయక్ (కాంగ్రెస్) పై 17, 381 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో రెడ్యానాయక్కు 88,307 ఓట్లు రాగా.. చంద్రు నాయక్కు 70,926 ఓట్లు వచ్చాయి. ఇక 2009 అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సత్యవతి రాథోడ్.. తన సమీప ప్రత్యర్థి డీఎస్ రెడ్యానాయక్ (కాంగ్రెస్) పై 4,623 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో సత్యవతి రాథోడ్కు 69,282 ఓట్లు రాగా.. రెడ్యా నాయక్కు 64,659 ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికలు.. 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అబ్యర్థి డీఎస్ రెడ్యానాయక్.. తన సమీప ప్రత్యర్థి సత్యవతి రాథోడ్ (బీఆర్ఎస్) పై 23,531 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో రెడ్యా నాయక్కు 84,170 ఓట్లు రాగా.. సత్యవతికి 60,639 ఓట్లు వచ్చాయి.
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |
| పార్టీ |
బి.ఆర్.ఎస్ |
కాంగ్రెస్ |
బి.జె.పి+ |
ఎంఐఎం |
ఇతరులు |
|---|---|---|---|---|---|
| ఆదిక్యం | 00 | 00 | 00 | 00 | 00 |
| గెలుపు | 00 | 00 | 00 | 00 | 00 |