Home » YuvaGalam
యువగళం పాదయాత్రపై ఐ ప్యాక్ సభ్యులు నిఘా పెట్టారు. కనిగిరి నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న పాదయాత్రలోకి ఐ ప్యాక్ సభ్యుడు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఐ ప్యాక్ సభ్యుడిని టీడీపీ క్యాడర్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. యువగళం పాదయాత్రలో జరుగుతున్న లైవ్ అప్డేట్స్ను, ఎప్పటికప్పుడు ఐ ప్యాక్ సభ్యులు బయటికి చేరవేస్తున్నారు.
ఏపీ వ్యాప్తంగా నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజా బలంగా, ప్రజాగళంగా ఇప్పటివరకు 53 శాసనసభ నియోజకవర్గాలు, 135 మండలాలు, 1297 గ్రామాల మీదుగా లోకేష్ పాదయాత్ర సాగింది. 152 రోజుల పాదయాత్రలో సుమారు 30 లక్షల మంది ప్రజలను లోకేష్ నేరుగా కలుసుకుని వాళ్ల సమస్యలను విన్నారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.
టీడీపీ యువనే నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 2000 కిలోమీటర్ల చారిత్రాత్మక మైలురాయికి చేరుకుంది.
150వ రోజు ఉప్పు రైతులతో సమావేశం పెట్టుకోవడం నాకు సంతోషంగా ఉంది. ఉప్పు లేనిదే కూర రుచి ఉండదు. ఉప్పు సత్యాగ్రహం చేసినప్పుడు గాంధీ ఈ ప్రాంతానికి వచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తక్కువ ధరకే ఉప్పు రైతులకి విద్యుత్ అందజేశారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ యువ నేత నారా లోకేష్ (Nara Lokesh) యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. ప్రస్తుతం గూడూరు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. ఈరోజు తాడిమేడు క్యాంపు సైటు నుంచి 139రోజు పాదయాత్రను లోకేష్ మొదలుపెట్టారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్రం విజయవంతంగా దూసుకెళ్తోంది. ఎక్కడికక్కడ ప్రజలు పాదయాత్రకు నీరాజనాలు పలుకుతున్నారు. వందల సంఖ్యలో ప్రజలు లోకేష్ వెంట పాదయాత్ర చేస్తూ తమ సమస్యలను చెప్పుకొంటున్నారు. చిన్నా, పెద్దా అనే తేడాల లేకుండా యువనేత అందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. పాదయాత్ర చేస్తున్న ప్రాంతాల్లో అనేక సంఘాల ప్రతినిధులు, మహిళలు, రైతులు, యువత ఇలా ఎంతో మందితో ముఖాముఖిలు, చర్చలు నిర్వహిస్తున్నారు.
యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra)లో ఉన్న నారా లోకేశ్ (Nara Lokesh)ను ఆయన మేనమామ, ఎన్టీయార్ తనయుడు నందమూరి రామకృష్ణ (Nandamuri Ramakrishna) శుక్రవారం కలిశారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై (CM Jagan MohanReddy) టీడీపీ యువ నేత నారా లోకేష్ (Nara Lokesh) విమర్శలు గుప్పించారు.
‘‘2014లో ప్రచారానికి వచ్చినప్పుడు.. నేను నా తల్లికి, భార్యకు వెంకటగిరి చీరలు తీసుకెళ్లా. వెంకటగిరి హ్యాండ్లూమ్కి ఒక బ్రాండ్ ఉంది. దానికి కావాల్సింది మార్కెటింగ్ మాత్రమే’’ అని నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. డక్కిలిలో చేనేత కార్మికులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు.