Home » ys viveka murder case
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారిన వైఎస్ వివేకానంద రెడ్డి ( YS Vivekananda Reddy ) హత్య నేపథ్యంలో తీసిన వివేకం సినిమా ఏపీ పాలిటిక్స్ ను కుదిపేస్తున్నాయి. ఈ సినిమాపై అభ్యంతరాలు రోజురోజుకు అధికమవుతున్నాయి. ఈ క్రమంలో వివేకా హత్య కేసులో అప్రూవల్ గా ఉన్న దస్తగిరి హైకోర్టును ఆశ్రయించారు.
కడప లోక్సభ టీడీపీ అభ్యర్థిగా చడిపిరాళ్ల భూపేష్ రెడ్డి పేరును ఆ పార్టీ శుక్రవారం ప్రకటించింది. అంటే.. కూటమి అభ్యర్థిగా భూపేష్ రెడ్డి పేరు ఖరారైంది.
Andhra Pradesh News: వైఎస్ జగన్ తీరుపై దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి(YS Vivekananda Reddy) కూతురు సునీత(YS Sunitha) కన్నెర్ర చేశారు. అసలు చిన్నాన్న అంటే అర్థం తెలుసా? అని జగన్ను(YS Jagan) నిలదీశారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన సునీత..
మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత వ్యాఖ్యలు చేసింది. ‘‘ మా అన్న పార్టీకి ఎవరూ ఓటు వేయొద్దు’’ అని ఆమె కోరారు. తన తండ్రి వివేకాకి జరిగినట్లు మరెవ్వరికీ జరగకూడదని, నిందితులకు శిక్షపడాలని ఆమె డిమాండ్ చేశారు. వైఎస్ వివేకా వర్ధంతి సందర్భంగా కడపలో ఏర్పాటు చేసిన స్మారక సభలో ఆమె మాట్లాడారు.
Andhrapradesh: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య జరగడం పులివెందుల వాసిగా సిగ్గుపడుతున్నా అని పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి అన్నారు. వైఎస్ వివేకా 5 వ స్మారకోత్సవ సభకు బీటెక్ రవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘వివేకాపై నేను పోటీచేసి గెలిచినప్పటికి ఆయన నాతో చాలా బాగా మాట్లాడే వారు’’ అని గుర్తుచేశారు.
సరిగ్గా ఎన్నికలకు నెల ముందు జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి(YS Vivekananda Reddy) హత్యను నాటి విపక్ష నేత జగన్ గత ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా వాడుకున్నారు. చంద్రబాబే(Chandrababu) హత్య చేయించారంటూ జగన్ శిబిరం తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. ‘నారాసుర రక్తచరిత్ర’ అంటూ కట్టుకథలు వండి వార్చింది. వివేకా హత్య జగన్కు(YS Jagan) సానుభూతి అస్త్రంగా మారి గెలుపులో కీలకపాత్ర పోషించింది.
Andhrapradesh: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరు అయ్యింది. దేవిరెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రెండు లక్షల పోచికత్తు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. ప్రతి సోమవారం సీసీఎస్ పోలీస్ స్టేషన్ ముందు హాజరుకావాలని తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రవేశించొద్దని హైకోర్టు షరతు విధించింది.
దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి(YS Viveka) హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక వ్యక్తి అయిన దస్తగిరి(Dastagiri).. ఎంపీ అవినాష్ రెడ్డి(YS Avinash Reddy) బెయిల్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవల్గా మారిన తనపై తప్పుడు సాక్ష్యం చెప్పాలంటూ..
Andhrapradesh: మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి తండ్రి హాజీపీరాపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడం కలకలం రేపుతోంది. గత రాత్రి పులివెందులలో దస్తగిరి తండ్రిని కొందరు వ్యక్తులు బెదిరిస్తూ.. దాడికి పాల్పడారు. శివరాత్రి జాగరణకు వెళ్లిన హాజీపీరాను అడ్డగించి దాడి చేశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీతాపై నమోదైన కేసులో కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్ట్ అసహనం వ్యక్తం చేసింది. కేసు పెట్టిన కృష్ణారెడ్డి తరపున న్యాయవాదిని కౌంటర్ దాఖలు చేసేందుకు ఎంత సమయం తీసుకుంటారని హైకోర్ట్ ప్రశ్నించింది.