Home » Yogi Adityanath
దేశంలో అత్యంత పాపులర్ సీఎంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిలిచారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను వెనక్కు నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఆయన రెండో స్థానంలో నిలిచారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాత్ జ్ఞానవాపిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జ్ఞానవాపి మసీదు లోపల ఉన్న ‘వ్యాస్ కా టెఖానా’లో మంగళవారం నాడు పూజ చేశారు.
జ్ఞానవాపి మసీదుపై వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పు ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే. ఈ మసీదు కింద ఆలయ శిథిలాలు ఉన్నాయని పురావస్తు శాఖ సర్వే ఆధారంగా.. సెల్లార్లో హిందువులు పూజలు నిర్వహించుకోవచ్చని కోర్టు ఇచ్చిన అనుమతిపై ముస్లిం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్లోని 80 లోక్సభ స్థానాలు గెలుచుకునేందుకు బీజేపీ పట్టుదలగా ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర అసెంబ్లీలో అయోధ్యలోని రామమందిరంతో పాటు మధుర, కాశీ ఆలయాల ప్రస్తావన చేశారు. అయోధ్యలోని రామాలయం రాష్ట్రానికి ఎలాంటి గుర్తింపు తెచ్చిందో సభలో వివరించారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు ప్రజల్లో ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కూడా తన ఖాతాను అనుసరిస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. ఎంతలా అంటే ఏకంగా ఢిల్లీ సీఎం ఫాలోవర్లను అధిగమించారు యూపీ సీఎం.
మరోసారి మత సామరస్యం వెల్లివిరిసింది. అవును ఓ ముస్లిం యువకుడు రామచరిత్ మానస్ తప్పులు లేకుండా అద్భుతంగా పారాయణం చేశాడు. ఆ క్రమంలో చూసిన సీఎం అతని ప్రతిభను చూసి మెచ్చుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాముడు పుట్టిన అయోధ్యలో రామాలయం నిర్మించాలన్న 500 ఏళ్ల నాటి ప్రజల కల నేటికి సాకారమైందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.1990లో కరసేవకులకు ఎదురైన అనుభవాన్ని ప్రస్తావిస్తూ, ఇప్పుడు అయోద్యలో ఎలాంటి కర్ఫ్యూలు, కాల్పులు లేవన్నారు.
అయోధ్యలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. 51 అంగుళాల రామ్ లల్లా విగ్రహాన్ని ఆలయ అర్చకులు శుక్రవారం ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమం కనుల పండువగా జరిగింది. ప్రతిష్ఠాపన సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్యకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలరాముడికి సంబంధించిన కొత్త ఫొటోలను ఆలయ అధికారులు విడుదల చేశారు.
అయోధ్యలో ఈ నెల 22వ తేదీన రామ్లల్లా ప్రాణ ప్రతిష్ట జరగనుంది. అహ్మదాబాద్ - అయోధ్యను కలిపే వీక్లీ ట్రై విమానాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గురువారం ప్రారంభించారు.
శ్రీరాముని నామంతో అయోధ్యపురి మారుమోగుతోంది. ఈ నెల 22వ తేదీన రామజన్మభూమిలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ట జరగబోతోంది. ఇప్పటికే అయోధ్య పురవీధుల్లో భక్త జన సంచారం పెరిగింది. అందుకు తగిన ఏర్పాట్లను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిమగ్నమైంది.