Home » Yashasvi Jaiswal
మొదటి టెస్ట్ మ్యాచ్లో వెస్టిండీస్పై ఘనవిజయం సాధించిన టీమిండియా రెండు రికార్డులను కూడా ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్లో భారత జట్టు ఇన్నింగ్స్ 141 పరుగుల (India won by an innings and 141 runs) భారీ తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. పరుగుల పరంగా ఆసియా వెలుపల టీమిండియాకు ఇదే అతి పెద్ద విజయం.
వెస్టిండీస్తో నేటి నుంచి ప్రారంభం కాబోయే మొదటి టెస్ట్ మ్యాచ్లో తనతోపాటు ఆడే ఓపెనర్పై కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టత ఇచ్చాడు. 21 ఏళ్ల యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్లో తనతోపాటు ఓపెనర్గా ఆడతాడని, శుభ్మన్ గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్కు వస్తాడని హిట్మ్యాన్ స్పష్టం చేశాడు. 2023-2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో భాగంగా టీమిండియా ఆడుతున్న మొదటి టెస్ట్ సిరీస్ ఇదే కావడం గమనార్హం.
వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా గ్రౌండ్ ప్రాక్టీస్ షురూ చేసింది. 17 మంది సభ్యుల టీమిండియా రెండుగా విడిపోయి రెండు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. బ్యాటర్లు ఒక టీమ్గా, బౌలర్లు మరో టీమ్గా తలపడుతున్నారు. అయితే అనూహ్యంగా వార్మప్ మ్యాచ్లో శుభ్మన్ గిల్ స్థానంలో యువ క్రికెటర్ యషస్వీ జైశ్వాల్ ఓపెనర్గా బరిలోకి దిగాడు.
ఇటీవల ముగిసిన ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ తరఫున మెరుపు ఇన్నింగ్స్తో అందరి దృష్టిని ఆకర్షించిన జైశ్వాల్ ఏకంగా టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. త్వరలో వెస్టిండీస్ పర్యటనలో రెండు టెస్టుల కోసం ప్రకటించిన టీమిండియాలో సీనియర్ ఆటగాడు పుజారా స్థానంలో జైశ్వాల్కు సెలక్టర్లు అవకాశం కల్పించారు. అయితే ఐపీఎల్ లాంటి మెగా క్రికెట్ లీగ్లోనూ స్లెడ్జింగ్ జరుగుతోందని జైశ్వాల్ అన్నాడు.